ETV Bharat / crime

సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం.. 250 క్వింటాళ్లు సీజ్

పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటున్నాయి. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ లారీ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. 250 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

author img

By

Published : Jun 5, 2021, 12:05 PM IST

pds rice, ration rice seized
రేషన్ బియ్యం పట్టివేత, కర్నాటకకు తరలిస్తున్న రేషన్ బియ్యం

అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు నుంచి ఓ లారీలో కొడంగల్-తాండూరు మీదుగా కర్నాటకకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. తాండూరు పట్టణంలోని ఇందిరా గాంధీ కూడలిలో తనిఖీ చేయగా... డ్రైవర్ సమాధానాలతో అనుమానం వచ్చిందని వివరించారు.

లారీని పోలీస్ స్టేషన్​కి తరలించగా... పోలీసుల విచారణలో కర్నాటకకు పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు డ్రైవర్ మహ్మద్ జాఫర్​ చెప్పాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి... రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించినట్లు సీఐ రాజేందర్ రెడ్డి వివరించారు.

అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు నుంచి ఓ లారీలో కొడంగల్-తాండూరు మీదుగా కర్నాటకకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. తాండూరు పట్టణంలోని ఇందిరా గాంధీ కూడలిలో తనిఖీ చేయగా... డ్రైవర్ సమాధానాలతో అనుమానం వచ్చిందని వివరించారు.

లారీని పోలీస్ స్టేషన్​కి తరలించగా... పోలీసుల విచారణలో కర్నాటకకు పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు డ్రైవర్ మహ్మద్ జాఫర్​ చెప్పాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి... రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించినట్లు సీఐ రాజేందర్ రెడ్డి వివరించారు.

ఇదీ చదవండి: లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.