ETV Bharat / crime

ACB RIDE: ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

చెక్కు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. మహబూబ్​నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం చౌదర్ పల్లి పంచాయతీ కార్యదర్శి అనురాధ రెడ్​ హ్యాండెడ్​గా అనిశాకు చిక్కారు.

author img

By

Published : Sep 30, 2021, 10:35 PM IST

ACB RIDE
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

కాసులకు కక్కుర్తి పడిన పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఓ గుత్తేదారుకు చెక్కు ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్​నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం చౌదర్​పల్లిలో ఈ ఘటన జరిగింది.

చౌదర్ పల్లి గ్రామంలో చేపట్టిన సీసీరోడ్డు బిల్లులకు సంబంధించి రూ.3 లక్షల చెక్కును గుత్తేదారుకు అందజేయగా.. మరో రూ.3 లక్షల 58 వేల చెక్కును అందించేందుకు డబ్బులు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి అనురాధ డిమాండ్ చేశారు. రూ.25 వేలు లంచం డిమాండ్ చేయగా... చివరికి రూ. 20 వేలు ఇచ్చేందుకు గుత్తేదారు, పంచాయతీ కార్యదర్శి మధ్య ఒప్పందం కుదిరింది. గత కొన్ని రోజులుగా డబ్బుల కోసం పంచాయతీ కార్యదర్శి అనురాధ.. ఆంజనేయులుపై ఒత్తిడి తీసుకురావడంతో ఆయన అనిశా అధికారులను ఆశ్రయించారు. జిల్లా కేంద్రంలోని కొత్తగంజ్ రైల్వే బ్రిడ్జి రహదారిపై గుత్తేదారు వద్ద నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శిని పట్టుకున్నారు. శుక్రవారం.. ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

కాసులకు కక్కుర్తి పడిన పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఓ గుత్తేదారుకు చెక్కు ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్​నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం చౌదర్​పల్లిలో ఈ ఘటన జరిగింది.

చౌదర్ పల్లి గ్రామంలో చేపట్టిన సీసీరోడ్డు బిల్లులకు సంబంధించి రూ.3 లక్షల చెక్కును గుత్తేదారుకు అందజేయగా.. మరో రూ.3 లక్షల 58 వేల చెక్కును అందించేందుకు డబ్బులు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి అనురాధ డిమాండ్ చేశారు. రూ.25 వేలు లంచం డిమాండ్ చేయగా... చివరికి రూ. 20 వేలు ఇచ్చేందుకు గుత్తేదారు, పంచాయతీ కార్యదర్శి మధ్య ఒప్పందం కుదిరింది. గత కొన్ని రోజులుగా డబ్బుల కోసం పంచాయతీ కార్యదర్శి అనురాధ.. ఆంజనేయులుపై ఒత్తిడి తీసుకురావడంతో ఆయన అనిశా అధికారులను ఆశ్రయించారు. జిల్లా కేంద్రంలోని కొత్తగంజ్ రైల్వే బ్రిడ్జి రహదారిపై గుత్తేదారు వద్ద నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శిని పట్టుకున్నారు. శుక్రవారం.. ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

ఇదీ చూడండి: CMRF Scam: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో కుంభకోణం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.