ETV Bharat / crime

తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి

తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి.

author img

By

Published : Jul 18, 2021, 1:32 PM IST

accident
accident

ఏపీ చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్‌గేట్ సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

భక్తులు.. చెన్నై నుంచి తిరుమలకు కాలినడకన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై ఆరా తీస్తున్నారు.

ఏపీ చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్‌గేట్ సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

భక్తులు.. చెన్నై నుంచి తిరుమలకు కాలినడకన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి : హుజూరాబాద్​ ఉపపోరుపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.