ఏపీ చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్గేట్ సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
భక్తులు.. చెన్నై నుంచి తిరుమలకు కాలినడకన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి : హుజూరాబాద్ ఉపపోరుపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి