ETV Bharat / crime

నాగరాజు హత్య కేసులో ముగిసిన కస్టడీ.. కీలక అంశాల వెల్లడి..

Saroornagar Honor Killing Case: నాగరాజు హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నిందితుల కస్టడీ రిపోర్ట్‌లోని పలు కీలక అంశాలను పోలీసులు వెల్లడించారు. నాగరాజు హత్యకు ఇద్దరే కుట్రపన్నారని.. నిందితులకు వేరే ఏ సంస్థతోనూ సంబంధంలేదని తెల్చారు.

author img

By

Published : May 17, 2022, 12:42 PM IST

Updated : May 17, 2022, 2:59 PM IST

Nagraju murder case accused Custody ended and police revealed  Key facts
Nagraju murder case accused Custody ended and police revealed Key facts

Saroornagar Honor Killing Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఇద్దరు ప్రధాన నిందితులను 5 రోజుల కస్టడీకి ఎల్బీనగర్​ కోర్టు అంగీకరించగా.. చర్లపల్లి జైలులో ఉన్న మొబిన్, అహ్మద్​లను పోలీసులు ప్రశ్నించారు. నిందితుల నుంచి కీలక సమాచారం సేరించారు. నాగరాజు హత్యలో ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. తన చెల్లిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మొబిన్, అతని బావ కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాగరాజు కదలికలను తెలుసుకునేందుకు మొబైల్ ట్రాకర్ అప్లికేషన్​ను ఉపయోగించారన్న అనుమానం నిజమైనట్టు తెలిపారు. కస్టడీ ముగియడంతో నిందితులను ఎల్బీనగర్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇద్దరు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.

"ఇద్దరు నిందితుల కాల్​డేటాను పరిశీలించాం. ఘటన జరిగిన రోజు నిందితులు.. కుటుంబసభ్యులతో తప్ప వేరెవ్వరితో మాట్లాడలేదు. మొబిన్ తన జీమెయిల్​కు పాస్​వర్డ్​గా చరవాణి నెంబర్​ పెట్టుకున్నాడు. నాగరాజు కూడా జీమెయిల్​కు​ చరవాణి నెంబరే పాస్​వర్డ్​ పెట్టి ఉండొచ్చని అంచనా వేసి.. ప్రయత్నించాడు. చరవాణి నెంబర్ టైప్ చేసి మొబిన్ సఫలమయ్యాడు. జీమెయిల్​లోకి వెళ్లి... ఫైండ్ మై డివైస్(Find my Device) అనే ఆఫ్షన్​ ఎంచుకున్నాడు. దీని సాయంతో నాగరాజు కదలికలను మొబిన్ తెలుసుకున్నాడు. ఈ నెల 4న పథకం ప్రకారం మాటు వేసిన మొబిన్, అహ్మద్ కలిసి నాగరాజును హత్య చేశారు. ఇద్దరు నిందితులకు ఏ సంస్థతోనూ సంబంధాలు లేవు." - పోలీసులు

ఇవీ చూడండి:

Saroornagar Honor Killing Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఇద్దరు ప్రధాన నిందితులను 5 రోజుల కస్టడీకి ఎల్బీనగర్​ కోర్టు అంగీకరించగా.. చర్లపల్లి జైలులో ఉన్న మొబిన్, అహ్మద్​లను పోలీసులు ప్రశ్నించారు. నిందితుల నుంచి కీలక సమాచారం సేరించారు. నాగరాజు హత్యలో ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. తన చెల్లిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మొబిన్, అతని బావ కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాగరాజు కదలికలను తెలుసుకునేందుకు మొబైల్ ట్రాకర్ అప్లికేషన్​ను ఉపయోగించారన్న అనుమానం నిజమైనట్టు తెలిపారు. కస్టడీ ముగియడంతో నిందితులను ఎల్బీనగర్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇద్దరు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.

"ఇద్దరు నిందితుల కాల్​డేటాను పరిశీలించాం. ఘటన జరిగిన రోజు నిందితులు.. కుటుంబసభ్యులతో తప్ప వేరెవ్వరితో మాట్లాడలేదు. మొబిన్ తన జీమెయిల్​కు పాస్​వర్డ్​గా చరవాణి నెంబర్​ పెట్టుకున్నాడు. నాగరాజు కూడా జీమెయిల్​కు​ చరవాణి నెంబరే పాస్​వర్డ్​ పెట్టి ఉండొచ్చని అంచనా వేసి.. ప్రయత్నించాడు. చరవాణి నెంబర్ టైప్ చేసి మొబిన్ సఫలమయ్యాడు. జీమెయిల్​లోకి వెళ్లి... ఫైండ్ మై డివైస్(Find my Device) అనే ఆఫ్షన్​ ఎంచుకున్నాడు. దీని సాయంతో నాగరాజు కదలికలను మొబిన్ తెలుసుకున్నాడు. ఈ నెల 4న పథకం ప్రకారం మాటు వేసిన మొబిన్, అహ్మద్ కలిసి నాగరాజును హత్య చేశారు. ఇద్దరు నిందితులకు ఏ సంస్థతోనూ సంబంధాలు లేవు." - పోలీసులు

ఇవీ చూడండి:

Last Updated : May 17, 2022, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.