ETV Bharat / crime

CRIME: సినిమా వాళ్లకే సినిమా చూపించాడు - సినిమా వాళ్లని మోసం చేసిన నాగార్జున రెడ్డి

వీడు మామూలోడు కాడు. తన మాటలతో సినిమా రంగం వారికే సినిమా చూపించాడు. మీ బ్యానర్‌లో నిర్మించిన చిత్రానికి ఫిలింఫేర్‌ అవార్డు వచ్చేలా చేస్తా.. అంటూ హైదరాబాద్‌లోని పలు చిత్ర నిర్మాణ సంస్థలకు టోపీ పెట్టాడు. ఓ సంస్థ రూ.3.5 లక్షలు ఇచ్చినట్లు ఒప్పుకొంది. పరువు పోతుందని మరికొన్ని సంస్థలు బయటకు చెప్పడం లేదు.

nagarjuna-reddy-cheating-telugu-industry-people
CRIME: సినిమా వాళ్లకే సినిమా చూపించాడు
author img

By

Published : Jun 24, 2021, 9:40 AM IST

ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌లో ఇంటర్వ్యూ.. కవర్‌పేజీపై మీ ఫొటో వేయిస్తానంటూ ఎంతోమంది ప్రముఖులను బోల్తా కొట్టించాడు ఓ కేటుగాడు. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల-రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. ఉద్యోగులందరికీ టీకాలు వేయిస్తానంటూ ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు దగ్గర రూ.లక్ష, మరో టాలీవుడ్‌ ప్రముఖ నటుడి నుంచి రూ.73 వేలు వసూలు చేశాడు. ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ నిర్వాహకుల నుంచి రూ.1.5 లక్షలు కొల్లగొట్టాడు. సదరు ఛానెల్‌ యాజమాన్యం ఫిర్యాదు మేరకు నిందితుడు నాగార్జునరెడ్డి (27)ని సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు ఈనెల 14న అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారించగా నిందితుడి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి.

పోలీసులకు చెప్పే వరకు కూడా..

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు నిందితుడి బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించారు. ఒకే ఒక్క బ్యాంక్‌ ఖాతా ఉండగా అందులో రూ.38 మాత్రమే ఉన్నాయి. పైగా ఆ ఖాతాను వేరే కేసులో పోలీసులు స్తంభింపజేశారు. ఆ తర్వాత లోతుగా ఆరా తీయగా నిందితుడు తన తల్లి ఖాతాను వినియోగిస్తున్నట్లుగా తేల్చారు. అంతేకాదు ఆ ఖాతాలో నగదు పడగానే వెంటనే విత్‌డ్రా చేసేవాడు. అందులో ఎవరెవరు డబ్బులు జమ చేశారని ఆరా తీయగా పలువురు ప్రముఖులు, చలనచిత్ర నిర్మాణ సంస్థలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ జాబితాలోని కొందరికి ఫోన్‌ చేసి అసలు విషయం చెప్పారు. అప్పటివరకు సదరు ప్రముఖులకు తాము మోసపోయినట్లు తెలియదు. సైబర్‌క్రైం పోలీసుల సూచన మేరకు టాలీవుడ్‌ ప్రముఖ నటుడు రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో, నిర్మాత సురేష్‌ బాబు జూబ్లీహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

పేకాట.. క్యాసినోలో జూదం కోసమే..

విజయవాడకు చెందిన నాగార్జునరెడ్డి 2015లో ఇంటర్‌ పూర్తిచేశాడు. అప్పటి నుంచే స్థానికంగా ఉండే ప్రముఖులను కలిసి ఫ్యాన్సీ మొబైల్‌ నంబర్లు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడేవాడు. తర్వాత చెన్నై వెళ్లి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసి ఓ హోటల్‌లో చెఫ్గా​ చేరాడు. లాక్‌డౌన్‌లో హైదరాబాద్‌ వచ్చాడు. చెన్నైలో పలు మోసాలు చేసినా ఎక్కడా కేసు నమోదు కాలేదు. డబ్బును పేకాట, క్యాసినోల్లో వినియోగించేవాడు.

వాళ్లయితే ఫిర్యాదు చేయరనే..

సినిమాలపై మోజుతో నిందితుడు కొంతకాలం ఫిలింనగర్‌లో ఉన్నాడు. అప్పుడు పలువురు ప్రముఖుల ఫోన్‌ నంబర్లు సేకరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయరనే ఉద్దేశంతోనే ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆరోగ్యశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని.. మంత్రి కేటీఆర్‌ మీ గురించి ప్రత్యేకంగా చెప్పాడంటూ బోల్తా కొట్టించేవాడు. ప్రాసెసింగ్‌ ఫీజు కింద ఒక్కొక్కరికి రూ.100 వసూలు చేసేవాడు.

ఇదీ చూడండి:టీకాల పేరుతో నిర్మాత సురేశ్‌ బాబుకు టోకరా

ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌లో ఇంటర్వ్యూ.. కవర్‌పేజీపై మీ ఫొటో వేయిస్తానంటూ ఎంతోమంది ప్రముఖులను బోల్తా కొట్టించాడు ఓ కేటుగాడు. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల-రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. ఉద్యోగులందరికీ టీకాలు వేయిస్తానంటూ ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు దగ్గర రూ.లక్ష, మరో టాలీవుడ్‌ ప్రముఖ నటుడి నుంచి రూ.73 వేలు వసూలు చేశాడు. ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ నిర్వాహకుల నుంచి రూ.1.5 లక్షలు కొల్లగొట్టాడు. సదరు ఛానెల్‌ యాజమాన్యం ఫిర్యాదు మేరకు నిందితుడు నాగార్జునరెడ్డి (27)ని సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు ఈనెల 14న అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారించగా నిందితుడి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి.

పోలీసులకు చెప్పే వరకు కూడా..

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు నిందితుడి బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించారు. ఒకే ఒక్క బ్యాంక్‌ ఖాతా ఉండగా అందులో రూ.38 మాత్రమే ఉన్నాయి. పైగా ఆ ఖాతాను వేరే కేసులో పోలీసులు స్తంభింపజేశారు. ఆ తర్వాత లోతుగా ఆరా తీయగా నిందితుడు తన తల్లి ఖాతాను వినియోగిస్తున్నట్లుగా తేల్చారు. అంతేకాదు ఆ ఖాతాలో నగదు పడగానే వెంటనే విత్‌డ్రా చేసేవాడు. అందులో ఎవరెవరు డబ్బులు జమ చేశారని ఆరా తీయగా పలువురు ప్రముఖులు, చలనచిత్ర నిర్మాణ సంస్థలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ జాబితాలోని కొందరికి ఫోన్‌ చేసి అసలు విషయం చెప్పారు. అప్పటివరకు సదరు ప్రముఖులకు తాము మోసపోయినట్లు తెలియదు. సైబర్‌క్రైం పోలీసుల సూచన మేరకు టాలీవుడ్‌ ప్రముఖ నటుడు రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో, నిర్మాత సురేష్‌ బాబు జూబ్లీహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

పేకాట.. క్యాసినోలో జూదం కోసమే..

విజయవాడకు చెందిన నాగార్జునరెడ్డి 2015లో ఇంటర్‌ పూర్తిచేశాడు. అప్పటి నుంచే స్థానికంగా ఉండే ప్రముఖులను కలిసి ఫ్యాన్సీ మొబైల్‌ నంబర్లు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడేవాడు. తర్వాత చెన్నై వెళ్లి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసి ఓ హోటల్‌లో చెఫ్గా​ చేరాడు. లాక్‌డౌన్‌లో హైదరాబాద్‌ వచ్చాడు. చెన్నైలో పలు మోసాలు చేసినా ఎక్కడా కేసు నమోదు కాలేదు. డబ్బును పేకాట, క్యాసినోల్లో వినియోగించేవాడు.

వాళ్లయితే ఫిర్యాదు చేయరనే..

సినిమాలపై మోజుతో నిందితుడు కొంతకాలం ఫిలింనగర్‌లో ఉన్నాడు. అప్పుడు పలువురు ప్రముఖుల ఫోన్‌ నంబర్లు సేకరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయరనే ఉద్దేశంతోనే ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆరోగ్యశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని.. మంత్రి కేటీఆర్‌ మీ గురించి ప్రత్యేకంగా చెప్పాడంటూ బోల్తా కొట్టించేవాడు. ప్రాసెసింగ్‌ ఫీజు కింద ఒక్కొక్కరికి రూ.100 వసూలు చేసేవాడు.

ఇదీ చూడండి:టీకాల పేరుతో నిర్మాత సురేశ్‌ బాబుకు టోకరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.