ETV Bharat / crime

డబ్బుల కోసం వేధింపులు.. స్నేహితుడి హత్య - ముషీరాబాద్ పీఎస్​ పరిధిలో హత్య

హైదరాబాద్​లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డబ్బుల కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. స్నేహితుని వేధింపులు భరించలేక అతన్ని అంతమొందించాడు.

murder in ranga nagar in  musheerabad ps  limits in hyderabad
డబ్బుల కోసం వేధింపులు.. స్నేహితుడి హత్య
author img

By

Published : Mar 6, 2021, 6:25 PM IST

స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ హత్యకు దారి తీసింది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఓ యువకుడిని హతమార్చాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని ముషీరాబాద్​ పరిధిలోని రంగానగర్​లో చోటు చేసుకుంది.

రంగానగర్​కు చెందిన పర్వేజ్ (22).. కొంతకాలంగా సద్దాం హుస్సేన్ అనే వ్యక్తిని డబ్బుల కోసం వేధించాడు. దీంతో ఆగ్రహానికి గురైన సద్దాం హుస్సేన్.. అతని స్నేహితుడు మోట గౌస్​తో కలిసి గత రాత్రి పర్వేజ్​ను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన యువకుడు ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు మృతిచెందాడు. గంజాయికి అలవాటు పడిన పర్వేజ్​.. సంఘ విద్రోహ కలాపాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆర్​ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.65లక్షలు స్వాధీనం

స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ హత్యకు దారి తీసింది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఓ యువకుడిని హతమార్చాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని ముషీరాబాద్​ పరిధిలోని రంగానగర్​లో చోటు చేసుకుంది.

రంగానగర్​కు చెందిన పర్వేజ్ (22).. కొంతకాలంగా సద్దాం హుస్సేన్ అనే వ్యక్తిని డబ్బుల కోసం వేధించాడు. దీంతో ఆగ్రహానికి గురైన సద్దాం హుస్సేన్.. అతని స్నేహితుడు మోట గౌస్​తో కలిసి గత రాత్రి పర్వేజ్​ను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన యువకుడు ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు మృతిచెందాడు. గంజాయికి అలవాటు పడిన పర్వేజ్​.. సంఘ విద్రోహ కలాపాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆర్​ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.65లక్షలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.