ETV Bharat / crime

MURDER: కోడలిని చంపిన మామ... వివాహేతర సంబంధమే కారణం

భర్త గల్ఫ్​లో ఉన్న సమయంలో భార్య మరొకరితో వివాహేతర బంధం పెట్టుకుంది. అతనితో వెళ్లిపోయింది. పోలీసుల కౌన్సిలింగ్​తో ఇంటికి వచ్చిన కోడలిని... మామ కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మేడిచర్లపాలెంలో చోటు చేసుకుంది.

author img

By

Published : Jul 31, 2021, 9:13 AM IST

MURDER
కోడలిని చంపిన మామ

వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబం పరువు తీసిందన్న కోపంతో తన కోడల్ని మామ హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చొప్పల సత్యనారాయణ.. కుమారుడు విజయకుమార్​కు ప్రియమణి అనే యువతితో గతంలో వివాహం జరిగింది. అయితే విజయకుమార్​.. ఉపాధి నిమిత్తం గల్ఫ్​లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ప్రియమణి స్థానికంగా ఉన్న వేరే సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఆరేళ్లుగా తన కుమారుడుతో, అత్తమామలతో కలిసి ఉంటున్న ప్రియమణి.. పది రోజుల క్రితం ఆ యువకుడితో వెళ్లిపోయింది. ఈ మేరకు సత్యనారాయణ.. మలికిపురం స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు వాళ్లిద్దరిని పట్టుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం ప్రియమణిని సత్యనారాయణ ఇంటికి పంపించారు.

మామ.. కోడలు మధ్య వాగ్వాదం

ఈ నేపథ్యంలో తిరిగి ఇంటికి వెళ్లిన కోడలు.. మామ మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన సత్యనారాయణ.. ప్రియమణిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలో అడ్డుగా వచ్చిన ప్రియమణి తల్లి మంజులకు స్వల్ప గాయలయ్యాయి. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్​ వచ్చి లొంగిపోయాడు. ఇంటి పరువు తీస్తుందనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసి రాజోలు సీఐ దుర్గాశేఖర్​ రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు

ఇదీ చదవండి: భర్తను చంపి.. సాధారణ మరణంగా సృష్టించబోయి....

couple suicide: మా చావుకు ఆ ముగ్గురే కారణం.. దంపతుల సూసైడ్ నోట్

Madhapur murder : ఇంట్లో వాళ్లకి చెప్పమందనే.. హత్య, ఆపై ఆత్మహత్య!

వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబం పరువు తీసిందన్న కోపంతో తన కోడల్ని మామ హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చొప్పల సత్యనారాయణ.. కుమారుడు విజయకుమార్​కు ప్రియమణి అనే యువతితో గతంలో వివాహం జరిగింది. అయితే విజయకుమార్​.. ఉపాధి నిమిత్తం గల్ఫ్​లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ప్రియమణి స్థానికంగా ఉన్న వేరే సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఆరేళ్లుగా తన కుమారుడుతో, అత్తమామలతో కలిసి ఉంటున్న ప్రియమణి.. పది రోజుల క్రితం ఆ యువకుడితో వెళ్లిపోయింది. ఈ మేరకు సత్యనారాయణ.. మలికిపురం స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు వాళ్లిద్దరిని పట్టుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం ప్రియమణిని సత్యనారాయణ ఇంటికి పంపించారు.

మామ.. కోడలు మధ్య వాగ్వాదం

ఈ నేపథ్యంలో తిరిగి ఇంటికి వెళ్లిన కోడలు.. మామ మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన సత్యనారాయణ.. ప్రియమణిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలో అడ్డుగా వచ్చిన ప్రియమణి తల్లి మంజులకు స్వల్ప గాయలయ్యాయి. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్​ వచ్చి లొంగిపోయాడు. ఇంటి పరువు తీస్తుందనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసి రాజోలు సీఐ దుర్గాశేఖర్​ రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు

ఇదీ చదవండి: భర్తను చంపి.. సాధారణ మరణంగా సృష్టించబోయి....

couple suicide: మా చావుకు ఆ ముగ్గురే కారణం.. దంపతుల సూసైడ్ నోట్

Madhapur murder : ఇంట్లో వాళ్లకి చెప్పమందనే.. హత్య, ఆపై ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.