Commissioner's wife commits suicide in Mancherial: మంచిర్యాల పురపాలక సంఘం కమిషనర్ బాలకృష్ణ సతీమణి జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్న భోజన సమయానికి ఇంటికి వచ్చిన కమిషనర్ తలుపు తట్టాడు. ఇంటి లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో ఎంతసేపటికి ఎవరు తలుపులు తెరవలేదు. దీంతో ఆయన ఆందోళనతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లే సరికి ఫ్యానుకు ఉరి వేసుకుని జ్యోతి విగత జీవిగా కనిపించింది.
ఆమె అలా కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ని పరామర్శించారు. ఆయన భార్య కోల్పోవడంతో కమిషనర్ రోదన అందర్నీ కలిసివేసింది. పాఠశాల నుంచి వచ్చిన తమ పిల్లలకు ఏమి సమాధానం చెప్పాలి అంటూ రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ పరిశీలించారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి: