ETV Bharat / crime

ఇంటి తాళం పగులగొట్టి చోరీ.. నగదు, బంగారం అపహరణ

author img

By

Published : Mar 1, 2021, 10:10 AM IST

ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి చోరీ చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో చోటుచేసుకుంది. రూ.50 వేలు, 2 తులాల బంగారం, 15 తులాల వెండి చోరీ అయినట్లు పోలీసులు తెలిపారు.

money and gold theft at mothkur in yadadri bhuvanagiri district
ఇంటి తాళం పగులగొట్టి చోరీ

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలికలోని వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్న భాస్కరాచారీ వారం రోజుల క్రితం తన కుమార్తె ఇంటికి వెళ్లారు. తిరిగి వచ్చే సరికి గేటుకు తాళం వేసే ఉందని, ఇంటి మెయిన్​ డోర్​కు వేసిన తాళం పగులగొట్టి ఉందని తెలిపారు.

లోపలికి వెళ్లి చూడగా.. పడక గదిలో ఉన్న బీరువా తెరిచి ఉందని, వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయని భాస్కరాచారీ చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.

money and gold theft at mothkur in yadadri bhuvanagiri district
ఇంటి తాళం పగులగొట్టి చోరీ

ఘటానా స్థలికి చేరుకున్న పోలీసులు వేలి ముద్రలు సేకరించారు. రూ.50వేలు, 2 తులాల బంగారం, 15 తులాల వెండి చోరీకి గురైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలికలోని వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్న భాస్కరాచారీ వారం రోజుల క్రితం తన కుమార్తె ఇంటికి వెళ్లారు. తిరిగి వచ్చే సరికి గేటుకు తాళం వేసే ఉందని, ఇంటి మెయిన్​ డోర్​కు వేసిన తాళం పగులగొట్టి ఉందని తెలిపారు.

లోపలికి వెళ్లి చూడగా.. పడక గదిలో ఉన్న బీరువా తెరిచి ఉందని, వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయని భాస్కరాచారీ చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.

money and gold theft at mothkur in yadadri bhuvanagiri district
ఇంటి తాళం పగులగొట్టి చోరీ

ఘటానా స్థలికి చేరుకున్న పోలీసులు వేలి ముద్రలు సేకరించారు. రూ.50వేలు, 2 తులాల బంగారం, 15 తులాల వెండి చోరీకి గురైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.