ETV Bharat / crime

Women Missing: స్కానింగ్​కి వెళ్తున్నానని చెప్పింది... అదృశ్యమైంది

స్కానింగ్ సెంటర్​కు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లిన వివాహిత అదృశ్యమైన ఘటన మారేడ్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

author img

By

Published : Jun 18, 2021, 6:55 PM IST

married-women-missing-in-west-marredpally
Women Missing: స్కానింగ్​కి వెళ్తున్నానని చెప్పింది... అదృశ్యమైంది

సికింద్రాబాద్​ వెస్ట్ మారేడ్​పల్లి(West Marredpally )లోని లలితా నగర్ కాలనీలో కొమురయ్య, నిర్మల దంపతులు నివాసముంటున్నారు. ఆరోగ్యరీత్యా స్కానింగ్ సెంటర్​కి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకి చెప్పి బయటకు వెళ్లిన నిర్మల ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు చుట్టుపక్కలా వెతికారు.

ఇరుగు పొరుగు వారిని, బంధువుల ఇళ్లలో ఆరా తీసినా... ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. వెంటనే నిర్మల భర్త కొమురయ్య మారేడ్​పల్లి పోలీసులను ఆశ్రయించాడు. (Women Missing)కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సికింద్రాబాద్​ వెస్ట్ మారేడ్​పల్లి(West Marredpally )లోని లలితా నగర్ కాలనీలో కొమురయ్య, నిర్మల దంపతులు నివాసముంటున్నారు. ఆరోగ్యరీత్యా స్కానింగ్ సెంటర్​కి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకి చెప్పి బయటకు వెళ్లిన నిర్మల ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు చుట్టుపక్కలా వెతికారు.

ఇరుగు పొరుగు వారిని, బంధువుల ఇళ్లలో ఆరా తీసినా... ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. వెంటనే నిర్మల భర్త కొమురయ్య మారేడ్​పల్లి పోలీసులను ఆశ్రయించాడు. (Women Missing)కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: కరోనా రోగుల సేవలో యువతి- అంబులెన్స్​ డ్రైవర్​గా ఆదర్శం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.