ETV Bharat / crime

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సికింద్రాబాద్​లోని బజరంగ్​నగర్ కాలనీలో జరిగింది. అత్తింటివారే తమ కూతురిని చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

author img

By

Published : Jan 27, 2021, 2:28 AM IST

Married lady died under suspicious circumstances secundrabad
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
సికింద్రాబాద్​లోని బజరంగ్​నగర్ కాలనీలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సికింద్రాబాద్​లోని బజరంగ్​నగర్ కాలనీకి చెందిన దీపిక, ప్రశాంత్ గౌడ్​కు 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇప్పటి వరకు సంతానం కలగలేదు. మంగళవారం దీపిక ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అయితే అత్తారింటివారే తమ కూతురిని చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: వెంగళపూర్​లో యువకుడి దారుణ హత్య

సికింద్రాబాద్​లోని బజరంగ్​నగర్ కాలనీలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సికింద్రాబాద్​లోని బజరంగ్​నగర్ కాలనీకి చెందిన దీపిక, ప్రశాంత్ గౌడ్​కు 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇప్పటి వరకు సంతానం కలగలేదు. మంగళవారం దీపిక ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అయితే అత్తారింటివారే తమ కూతురిని చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: వెంగళపూర్​లో యువకుడి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.