ETV Bharat / crime

హత్య చేశారు.. ఆపై తలను ఎత్తుకెళ్లారు

author img

By

Published : Dec 27, 2022, 5:26 PM IST

Man was killed in annamayya district: ఆంధ్రప్రదేశ్​లో దారుణ హత్య జరిగింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలోని బెంగళూరు రోడ్డులో చోటుచేసుకుంది. నిందితులు, హతుడి మొండెం నుంచి తలను వేరు చేసి హత్య చేశారు. గత ఆదివారం జరిగిన ఈ ఘటనలో మృతుడి వివరాలు పోలీసులు గుర్తించారు. మృతుడు నిమ్మనపల్లి మండలం గార బురుజుకు చెందిన రమేష్​గా గుర్తించారు.

Man was killed
Man was killed

Man was killed and his head taken away: ఆంధ్రప్రదేశ్​లో అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బెంగళూరు రోడ్డు జావుకుపల్లి దగ్గర మామిడి తోటలో హత్య జరిగింది. హతుడు నిమ్మనపల్లి మండలం గార బురుజుకు చెందిన రమేష్​గా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దుండగులు రమేష్​ని కిరాతకంగా చంపారు. మొండెం నుంచి తలను వేరుచేశారు.

మెుదట కళ్లలో కారంపొడి చల్లి అనంతరం హత్య చేసినట్లు తెలుస్తోంది. ద్విచక్ర వాహనం పక్కనే మొండెం పడి ఉంది. హత్య సమాచారం తెలుసుకున్న మదనపల్లి రూరల్ పోలీసులు ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ హత్య ఆదివారం రాత్రి జరిగినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

అయితే ఇంతవరకు అతని తల ఆచూకీ మాత్రం తెలియలేదు. హతుడు రమేష్ గత మే నెలలో నిమ్మనపల్లి మండలంలో జరిగిన వెంకటరమణ హత్య కేసులో రెండో నిందితునిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అప్పటి నుంచి తన ప్రత్యర్థుల నుంచి తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో హత్య జరగడంతో చనిపోయిన వ్యక్తి రమేష్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Man was killed and his head taken away: ఆంధ్రప్రదేశ్​లో అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బెంగళూరు రోడ్డు జావుకుపల్లి దగ్గర మామిడి తోటలో హత్య జరిగింది. హతుడు నిమ్మనపల్లి మండలం గార బురుజుకు చెందిన రమేష్​గా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దుండగులు రమేష్​ని కిరాతకంగా చంపారు. మొండెం నుంచి తలను వేరుచేశారు.

మెుదట కళ్లలో కారంపొడి చల్లి అనంతరం హత్య చేసినట్లు తెలుస్తోంది. ద్విచక్ర వాహనం పక్కనే మొండెం పడి ఉంది. హత్య సమాచారం తెలుసుకున్న మదనపల్లి రూరల్ పోలీసులు ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ హత్య ఆదివారం రాత్రి జరిగినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

అయితే ఇంతవరకు అతని తల ఆచూకీ మాత్రం తెలియలేదు. హతుడు రమేష్ గత మే నెలలో నిమ్మనపల్లి మండలంలో జరిగిన వెంకటరమణ హత్య కేసులో రెండో నిందితునిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అప్పటి నుంచి తన ప్రత్యర్థుల నుంచి తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో హత్య జరగడంతో చనిపోయిన వ్యక్తి రమేష్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.