ETV Bharat / crime

విద్యుత్​ ట్రాన్స్​ ఫార్మర్​ను 'ఢీ' కొని ఏనుగు మృతి

author img

By

Published : Dec 2, 2022, 7:05 PM IST

Elephant died due to electrocution: ఏపీలోని చిత్తూరు జిల్లా మొగలివారిపల్లి కౌండిన్య అభయారణ్యం లో.. విద్యుదాఘాతంతో మగ ఏనుగు మృతి చెందింది. కుంటబెల్ల అటవీ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్​ను అనుకోవడంతో షాక్​కు గురైనట్లు స్థానికులు గుర్తించారు. గత 6 నెలల్లో 4 ఏనుగులు విద్యుత్ ప్రమాదాలతో మృత్యువాత పడ్డాయని తెలిపారు.

Elephant died
ఏనుగు మృతి

Male elephant died due to electrocution: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. మొగలివారిపల్లిలోని కుంటబెల్ల అటవీ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ను ఏనుగు తాకింది. ఈ క్రమంలో.. షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయింది. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అభయారణ్యంలో ఆరు నెలల వ్యవధిలో 4 ఏనుగులు విద్యుదాఘాతంతో చనిపోయాయని స్థానికులు విచారం వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతునప్పటికి అధికారుల్లో ఎలాంటి చలనం కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులతో పాటుగా.. అటవీ అధికారుల సమన్వయంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Male elephant died due to electrocution: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. మొగలివారిపల్లిలోని కుంటబెల్ల అటవీ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ను ఏనుగు తాకింది. ఈ క్రమంలో.. షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయింది. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అభయారణ్యంలో ఆరు నెలల వ్యవధిలో 4 ఏనుగులు విద్యుదాఘాతంతో చనిపోయాయని స్థానికులు విచారం వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతునప్పటికి అధికారుల్లో ఎలాంటి చలనం కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులతో పాటుగా.. అటవీ అధికారుల సమన్వయంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.