హైదరాబాద్-విజయవాడ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం తోళ్లు తరలిస్తున్న లారీ బోల్తా పడింది.
నిన్న సాయంత్రం నుంచి రహదారిపైనే లారీ అలాగే ఉంది. ఇవాళ లారీని పక్కకు తొలగించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఓ వైపు వర్షంతో జనాలు ఇబ్బందిపడుతుండగా.. లారీ బోల్తా పడడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదీ చదవండి: YADADRI: యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు