జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలానికి సమీపంలో ఓ లారీ... గొర్రెల మందను ఢీకొనడంతో 70 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 35 గొర్రెలకు గాయాలయ్యాయి. నందిన గ్రామానికి చెందిన రామప్ప అనే వ్యక్తి తెల్లవారుజామున 4 గంటల సమయంలో గొర్రెలు మేపేందుకు జూరాల డ్యాం ప్రాంతానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన గొర్రెల విలువ సుమారు 8 లక్షల రూపాయల వరకు ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాద అంశంపై విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి:'నన్నే తిట్టావు కదమ్మా.. నాతో పాటే నువ్వూ చావు..'