ETV Bharat / crime

kudikilla Farmer died for Land : భూమి పోయింది.. మట్టి మనిషి గుండె ఆగింది..!

kudikilla Farmer died for Land : పుడమితల్లినే నమ్ముకున్న రైతు... పుట్టినప్పటి నుంచి మట్టితోనే సహవాసం చేస్తున్నాడు. ఊపిరి వదిలేవరకు మట్టి మనిషిగానే బతకాలనుకున్నాడు. ఇక ప్రాణమున్నంత వరకు ఈ నేల తల్లితోనే మమేకమే ఉండాలనుకున్నాడు. పైసా పైసా కూడబెట్టుకొని 13 ఎకరాల భూమిని సంపాదించుకున్నాడు. పెద్ద మామిడి తోట పెట్టుకొని.. పసిపిల్లల్లా ఆ చెట్లను సాకుతున్నాడు. ప్రాజెక్టు పేరిట ఆ భూమిని లాక్కున్నారు. రూపాయి పరిహారం ఇవ్వలేదు. ప్రేమగా పెంచుకున్న ఆ మామిడి తోటలోని ఒక్క చెట్టు కొట్టగానే ఆ అన్నదాత గుండె పగిలింది.

author img

By

Published : Dec 24, 2021, 3:58 PM IST

kudikilla Farmer died for Land, Exiled farmers died
నిర్వాసిత రైతు మృతి

kudikilla Farmer died for Land : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన రైతు... మనస్తాపంతో తనువు చాలించాడు. కుడికిల్ల గ్రామానికి చెందిన రైతు తళ్లారి బాలస్వామి (65) గుండెపోటుతో మృతిచెందారు. తనకున్న భూమిలో రెక్కల కష్టం చేసుకొని బతికే ఆ రైతు భూమి లాక్కుని... పైసా పరిహారం ఇవ్వలేదని గుండె పగిలింది. ఆయన మృతదేహాన్ని పీఎస్‌కే కంపెనీ ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ ప్రధాన కాలువలో ఉన్న 13 ఎకరాల భూమిని ఆ రైతు కోల్పోయారు. గతంలో కేఎల్ఐ, మిషన్ భగీరథ పథకాల్లోనూ కొంత భూమి కోల్పోయారు. ఉన్న భూమి మరో ప్రాజెక్టు కోసం పోయింది. పరిహారం కోసం కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. అయినా రాకపోవడంతో గతకొంత కాలంగా మనస్తాపానికి గురయ్యారు.

అన్నదాత గుండె పగిలింది..

'భూమి పోయింది.. పరిహారం రాలేదు' అనే మనస్తాపంతోనే గుండెపోటు వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. మామిడి తోటను ప్రేమగా పెంచుకున్నారని... ఒక్క చెట్టు కొడితేనే మనస్తాపంతో మృతి చెందాడని కన్నీరు పెట్టుకున్నారు. ఆ భూమి మీద 20 మంది ఆధారపడి బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఎదుట నుంచి ధర్నాకి దిగారు. మృతుని కుటుంబానికి ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు. కంపెనీ యాజమాన్యం, అధికారులు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం... రైతుల భూములు లాక్కొని... మోసం చేస్తున్నారని ఆరోపించారు. మృతి చెందిన రైతు కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

'పాలమూరు ప్రాజెక్టు కాలువకు మాది 13 ఎకరాల భూమి పోతుంది. మాది చాలా పెద్ద మామిడి తోట. ఒక్క రూపాయి ఇవ్వకుండా మా భూములను దౌర్జన్యంగా తీసుకున్నారు. మేం సంతకాలు పెట్టకుండానే అన్యాయంగా మా భూములను లాక్కున్నారు. అందులో ఉన్న ఒక చెట్టు కొట్టేసరికి ఆ బాధ తట్టుకోలేక బీపీ పెరిగి కిందపడిపోయాడు. ఆస్పత్రిలో 15 రోజులు ఉన్నాడు. మాకు ఎవరు న్యాయం చేయలేదు. మేం ఎవరి చుట్టు తిరగాలి? మా భూమి కోసం కోలాడుతున్నాం.'

- బాధిత, కుటుంబ సభ్యులు

'చేను, ఊరు తప్ప ఇంకో ఊరుకు పోయేవారు కాదు వీళ్లు. ఆ భూమిలో పని చేసుకుంటూ బతికేవారు. అటువంటి వాళ్ల భూములను దౌర్జన్యంగా ఎలా లాక్కుంటారు? వాళ్ల సంతకం లేకుండా ఎలా తీసుకుంటారు? ఒక్క చెట్టు కొడితేనే మనిషి సచ్చిపోయిండు. పొద్దటి నుంచి ధర్నా చేస్తున్నా ఇప్పటిదాకా స్పందన లేదు.'

-గ్రామస్థుడు

ఇదీ చదవండి: రియల్​ లైఫ్​లో 'ఉప్పెన సీన్'.. ఆమెను ప్రేమించాడని మర్మాంగాన్ని కోసేసి..

kudikilla Farmer died for Land : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన రైతు... మనస్తాపంతో తనువు చాలించాడు. కుడికిల్ల గ్రామానికి చెందిన రైతు తళ్లారి బాలస్వామి (65) గుండెపోటుతో మృతిచెందారు. తనకున్న భూమిలో రెక్కల కష్టం చేసుకొని బతికే ఆ రైతు భూమి లాక్కుని... పైసా పరిహారం ఇవ్వలేదని గుండె పగిలింది. ఆయన మృతదేహాన్ని పీఎస్‌కే కంపెనీ ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ ప్రధాన కాలువలో ఉన్న 13 ఎకరాల భూమిని ఆ రైతు కోల్పోయారు. గతంలో కేఎల్ఐ, మిషన్ భగీరథ పథకాల్లోనూ కొంత భూమి కోల్పోయారు. ఉన్న భూమి మరో ప్రాజెక్టు కోసం పోయింది. పరిహారం కోసం కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. అయినా రాకపోవడంతో గతకొంత కాలంగా మనస్తాపానికి గురయ్యారు.

అన్నదాత గుండె పగిలింది..

'భూమి పోయింది.. పరిహారం రాలేదు' అనే మనస్తాపంతోనే గుండెపోటు వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. మామిడి తోటను ప్రేమగా పెంచుకున్నారని... ఒక్క చెట్టు కొడితేనే మనస్తాపంతో మృతి చెందాడని కన్నీరు పెట్టుకున్నారు. ఆ భూమి మీద 20 మంది ఆధారపడి బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఎదుట నుంచి ధర్నాకి దిగారు. మృతుని కుటుంబానికి ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు. కంపెనీ యాజమాన్యం, అధికారులు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం... రైతుల భూములు లాక్కొని... మోసం చేస్తున్నారని ఆరోపించారు. మృతి చెందిన రైతు కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

'పాలమూరు ప్రాజెక్టు కాలువకు మాది 13 ఎకరాల భూమి పోతుంది. మాది చాలా పెద్ద మామిడి తోట. ఒక్క రూపాయి ఇవ్వకుండా మా భూములను దౌర్జన్యంగా తీసుకున్నారు. మేం సంతకాలు పెట్టకుండానే అన్యాయంగా మా భూములను లాక్కున్నారు. అందులో ఉన్న ఒక చెట్టు కొట్టేసరికి ఆ బాధ తట్టుకోలేక బీపీ పెరిగి కిందపడిపోయాడు. ఆస్పత్రిలో 15 రోజులు ఉన్నాడు. మాకు ఎవరు న్యాయం చేయలేదు. మేం ఎవరి చుట్టు తిరగాలి? మా భూమి కోసం కోలాడుతున్నాం.'

- బాధిత, కుటుంబ సభ్యులు

'చేను, ఊరు తప్ప ఇంకో ఊరుకు పోయేవారు కాదు వీళ్లు. ఆ భూమిలో పని చేసుకుంటూ బతికేవారు. అటువంటి వాళ్ల భూములను దౌర్జన్యంగా ఎలా లాక్కుంటారు? వాళ్ల సంతకం లేకుండా ఎలా తీసుకుంటారు? ఒక్క చెట్టు కొడితేనే మనిషి సచ్చిపోయిండు. పొద్దటి నుంచి ధర్నా చేస్తున్నా ఇప్పటిదాకా స్పందన లేదు.'

-గ్రామస్థుడు

ఇదీ చదవండి: రియల్​ లైఫ్​లో 'ఉప్పెన సీన్'.. ఆమెను ప్రేమించాడని మర్మాంగాన్ని కోసేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.