మేడ్చల్ జిల్లా చింతల్ శ్రీనివాస్ నగర్లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో తెల్లవారుజామున ఏటీఎం చోరీకి దుండగులు యత్నించారు. గమనించిన పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా.. ఏటీఎం పగులగొట్టి నగదు చోరీకి యత్నించినట్లు గుర్తించారు.
మద్యం మత్తులో ఎవరైనా చేశారా.. ఏదైనా ముఠా యత్నించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం కావడం వల్ల ఘటనపై బ్యాంక్ అధికారులు ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు.. ముగ్గురి అరెస్ట్