ETV Bharat / crime

Husband Murdered Wife: మద్యానికి డబ్బులివ్వలేదని భార్యను గొడ్డలితో నరికి..

author img

By

Published : Feb 6, 2022, 8:34 PM IST

Husband Murdered Wife: మద్యానికి డబ్బులివ్వలేదని భార్యను గొడ్డలితో కిరాతకంగా నరికాడు ఓ భర్త. హఠాత్పరిణామానికి నిశ్చేష్టురాలైన ఆమె.. ఏం జరిగిందో గ్రహించేలోపే రక్తపు మడుగులో పడి స్పృహ కోల్పోయింది. ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మృతి చెందింది. నల్గొండ జిల్లా బొక్కముంతల్​ పహాడ్​లో ఈ దారుణం చోటుచేసుకుంది.

husband murdered wife
మద్యం కోసం భార్య హత్య

Husband Murdered Wife: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కముంతల్​ పహాడ్​లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. డబ్బులివ్వలేదనే కోపంతో భార్యను అతి కిరాతకంగా నరికాడు. మిర్యాలగూడ ఆస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామానికి చెందిన ధర్మారం రుద్రయ్య, రాజేశ్వరి(35) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి 15 సంవత్సరాలు కాగా.. చిన్న కుమారుడికి పదమూడేళ్లు. కరోనా సోకి ఇటీవల చిన్న కుమారుడు చనిపోయాడు. కొవిడ్​ కారణంగా ఉన్న ఊళ్లో పనులు లేకపోవడంతో.. హైదరాబాద్​కు వలస వెళ్లారు. అక్కడ అపార్ట్​మెంట్​లో పనికి కుదిరారు.

మద్యానికి బానిసై..

ఈ క్రమంలో కుమారుడిని కోల్పోయిన బాధలో రుద్రయ్య మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం నిరంతరం భార్యను వేధిస్తూ ఉండేవాడు. భర్త వేధింపులతో రాజేశ్వరి పూర్తిగా విసిగిపోయింది. దీంతో మరోసారి డబ్బులు అడిగినప్పుడు ఇవ్వొద్దని నిర్ణయించుకుంది.

husband murdered wife
భార్యను చంపిన రుద్రయ్య

శుభకార్యానికి వెళ్లి...

కొన్ని రోజుల క్రితం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో కుటుంబంతో కలిసి స్వగ్రామానికి చేరుకున్నారు. రాజేశ్వరి ఇంటిని శుభ్రం చేస్తున్న సమయంలో రుద్రయ్య.. ఆమె వద్దకు వచ్చి మద్యం కొనుక్కునేందుకు డబ్బులు కావాలని అడిగాడు. దీంతో ఆమె ఇవ్వనని చెప్పింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన రుద్రయ్య అక్కడే ఉన్న గొడ్డలితో ఆమె తలపై దాడి చేశాడు. ఘటనలో తీవ్ర గాయాలపాలైన రాజేశ్వరి.. రక్తపు మడుగులో పడిపోయింది. గమనించిన బంధువులు.. ఆమెను హుటాహుటిన మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు నిడమనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Couple Cheating: 'నమ్మకంగా ఉంటూ మమ్మల్ని నట్టేట ముంచారు.. న్యాయం చేయండి'

Husband Murdered Wife: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కముంతల్​ పహాడ్​లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. డబ్బులివ్వలేదనే కోపంతో భార్యను అతి కిరాతకంగా నరికాడు. మిర్యాలగూడ ఆస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామానికి చెందిన ధర్మారం రుద్రయ్య, రాజేశ్వరి(35) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి 15 సంవత్సరాలు కాగా.. చిన్న కుమారుడికి పదమూడేళ్లు. కరోనా సోకి ఇటీవల చిన్న కుమారుడు చనిపోయాడు. కొవిడ్​ కారణంగా ఉన్న ఊళ్లో పనులు లేకపోవడంతో.. హైదరాబాద్​కు వలస వెళ్లారు. అక్కడ అపార్ట్​మెంట్​లో పనికి కుదిరారు.

మద్యానికి బానిసై..

ఈ క్రమంలో కుమారుడిని కోల్పోయిన బాధలో రుద్రయ్య మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం నిరంతరం భార్యను వేధిస్తూ ఉండేవాడు. భర్త వేధింపులతో రాజేశ్వరి పూర్తిగా విసిగిపోయింది. దీంతో మరోసారి డబ్బులు అడిగినప్పుడు ఇవ్వొద్దని నిర్ణయించుకుంది.

husband murdered wife
భార్యను చంపిన రుద్రయ్య

శుభకార్యానికి వెళ్లి...

కొన్ని రోజుల క్రితం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో కుటుంబంతో కలిసి స్వగ్రామానికి చేరుకున్నారు. రాజేశ్వరి ఇంటిని శుభ్రం చేస్తున్న సమయంలో రుద్రయ్య.. ఆమె వద్దకు వచ్చి మద్యం కొనుక్కునేందుకు డబ్బులు కావాలని అడిగాడు. దీంతో ఆమె ఇవ్వనని చెప్పింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన రుద్రయ్య అక్కడే ఉన్న గొడ్డలితో ఆమె తలపై దాడి చేశాడు. ఘటనలో తీవ్ర గాయాలపాలైన రాజేశ్వరి.. రక్తపు మడుగులో పడిపోయింది. గమనించిన బంధువులు.. ఆమెను హుటాహుటిన మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు నిడమనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Couple Cheating: 'నమ్మకంగా ఉంటూ మమ్మల్ని నట్టేట ముంచారు.. న్యాయం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.