ETV Bharat / crime

Fake Seeds: భారీస్థాయిలో నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలో భారీస్థాయిలో నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.17 లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.

author img

By

Published : Jun 18, 2021, 9:22 PM IST

భారీస్థాయిలో నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత
భారీస్థాయిలో నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత

భారీస్థాయిలో నిషేధిత పత్తి విత్తనాలు తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.17 లక్షల విలువగల 850 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలను పరిశీలించిన రామగుండం కమిషనర్, జిల్లా ఇంఛార్జ్​ ఎస్పీ సత్యనారాయణ కేసు వివరాలను వెల్లడించారు.

జిల్లాలోని దహేగం మండలంలో పీపీ రావుకాలనీలో నిన్న తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారులో 45 పాకెట్ల పత్తి విత్తనాలు దొరికాయని తెలిపారు. వాహనంలోని పిట్టల శ్రీనివాస్, బండి శ్రీధర్​ను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి స్వస్థలమైన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో 750 కిలోల నిల్వలు ఉన్నాయని పోలీసులకు తెలిపారు. మరో 100 కిలోల వరకు స్థానిక రైతులకు విక్రయించినట్లు నిందితులు అంగీకరించారు

భారీస్థాయిలో నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత
భారీస్థాయిలో నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత

ఏపీలో కొనుగోలు

ఏపీలోని ఒంగోలు ప్రకాశం జిల్లాకు చెందిన సాయి అనే వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేసి రాష్ట్రానికి తరలించారని రామగుండం కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. దళారుల మాటలు విని రైతులు మోసపోవద్దని, అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిషేధిత విత్తన రాకెట్​ను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని కమిషనర్ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, కాగజ్ నగర్ ఏఎస్పీ బాలస్వామి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'విలాసాల కోసమే ప్రభుత్వ భూముల అమ్మకం'

భారీస్థాయిలో నిషేధిత పత్తి విత్తనాలు తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.17 లక్షల విలువగల 850 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలను పరిశీలించిన రామగుండం కమిషనర్, జిల్లా ఇంఛార్జ్​ ఎస్పీ సత్యనారాయణ కేసు వివరాలను వెల్లడించారు.

జిల్లాలోని దహేగం మండలంలో పీపీ రావుకాలనీలో నిన్న తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారులో 45 పాకెట్ల పత్తి విత్తనాలు దొరికాయని తెలిపారు. వాహనంలోని పిట్టల శ్రీనివాస్, బండి శ్రీధర్​ను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి స్వస్థలమైన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో 750 కిలోల నిల్వలు ఉన్నాయని పోలీసులకు తెలిపారు. మరో 100 కిలోల వరకు స్థానిక రైతులకు విక్రయించినట్లు నిందితులు అంగీకరించారు

భారీస్థాయిలో నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత
భారీస్థాయిలో నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత

ఏపీలో కొనుగోలు

ఏపీలోని ఒంగోలు ప్రకాశం జిల్లాకు చెందిన సాయి అనే వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేసి రాష్ట్రానికి తరలించారని రామగుండం కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. దళారుల మాటలు విని రైతులు మోసపోవద్దని, అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిషేధిత విత్తన రాకెట్​ను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని కమిషనర్ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, కాగజ్ నగర్ ఏఎస్పీ బాలస్వామి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'విలాసాల కోసమే ప్రభుత్వ భూముల అమ్మకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.