ETV Bharat / crime

Wedding Twist: వివాహానికి గంట ముందు.. కట్నం డబ్బులతో వరుడు పరారీ

author img

By

Published : Dec 16, 2021, 9:16 AM IST

Groom Ran Away: వివాహానికి గంట ముందు కట్నం డబ్బులతో వరుడు పరారయ్యాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Groom Ran Away
Groom Ran Away

Groom Ran Away: వివాహానికి గంట ముందు వరుడు పరారు కాగా.. పెళ్లి ఆగిపోయింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్‌ గ్రామానికి చెందిన యువతిని కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌కు చెందిన మాణిక్‌రెడ్డికు ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఆగస్టు 27న వీరికి నిశ్చితార్థం జరిపించగా.. రూ.25 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని వరుడికి కట్నం కింద ఇచ్చారు. ఈనెల 12న వివాహం చేయాలని నిర్ణయించారు.

సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో కల్యాణ మండపంలో వేదిక ఏర్పాటు చేశారు. వివాహానికి గంట ముందు కట్నం డబ్బులు, బంగారంతో వరుడు పారిపోయాడు. అనంతరం మాణిక్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఊరు విడిచి వెళ్లారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.సుభాష్​ తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలోనూ బుధవారం రోజు వధువు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఈనెల 12న చోటుచేసుకోగా బుధవారం రోజు వెలుగులోకి వచ్చింది.

Groom Ran Away: వివాహానికి గంట ముందు వరుడు పరారు కాగా.. పెళ్లి ఆగిపోయింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్‌ గ్రామానికి చెందిన యువతిని కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌కు చెందిన మాణిక్‌రెడ్డికు ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఆగస్టు 27న వీరికి నిశ్చితార్థం జరిపించగా.. రూ.25 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని వరుడికి కట్నం కింద ఇచ్చారు. ఈనెల 12న వివాహం చేయాలని నిర్ణయించారు.

సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో కల్యాణ మండపంలో వేదిక ఏర్పాటు చేశారు. వివాహానికి గంట ముందు కట్నం డబ్బులు, బంగారంతో వరుడు పారిపోయాడు. అనంతరం మాణిక్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఊరు విడిచి వెళ్లారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.సుభాష్​ తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలోనూ బుధవారం రోజు వధువు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఈనెల 12న చోటుచేసుకోగా బుధవారం రోజు వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి: Boy died in Mulugu: నీళ్లు అనుకొని పురుగులమందు తాగి.. బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.