Girl Suspect Death in Jeedimetla : మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సుభాశ్నగర్కు చెందిన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాత్రి ఇంట్లో నుంచి బాలిక అదృశ్యం కావడంతో.. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె మృతదేహం గుర్తించారు. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో.. రక్తపు మడుగులో పడి ఉంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా.. భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా.. లేక మరేమైన కారణలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష కోసం.. బాలిక మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.