ETV Bharat / crime

యాదాద్రి కొండ కింద లక్ష్మి పుష్కరిణిలో పడి బాలిక మృతి

author img

By

Published : May 15, 2022, 6:59 PM IST

Updated : May 15, 2022, 7:42 PM IST

యాదాద్రి కొండ కింద లక్ష్మి పుష్కరిణిలో పడి బాలిక మృతి
యాదాద్రి కొండ కింద లక్ష్మి పుష్కరిణిలో పడి బాలిక మృతి

18:57 May 15

యాదాద్రి కొండ కింద లక్ష్మి పుష్కరిణిలో పడి బాలిక మృతి

Yadadri: యాదాద్రి కొండ కింద గండి చెరువు ప్రాంగణంలో గల లక్ష్మి పుష్కరిణిలో పడి ఓ బాలిక మృతి చెందింది. కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరిణిలో స్నానానిరి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో పడగా.. ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు హైదరాబాద్ గుడి మల్కాపూర్​కి చెందిన బొంతల రోజా(15)గా గుర్తించారు. బాలిక మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దైవదర్శనానికి వచ్చిన తమకు ఇలా జరిగిందంటూ బాలిక తల్లి రోదించిన తీరు పలువురిని కలచివేసింది.

బాలిక మృతితో లక్ష్మి పుష్కరిణిలో భక్తులకు స్నానం ఆచరించడానికి అనుమతిని ఆలయ అధికారులు నిలిపివేశారు. సంప్రోక్షణ తదుపరి అనుమతిస్తామని వెల్లడించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

18:57 May 15

యాదాద్రి కొండ కింద లక్ష్మి పుష్కరిణిలో పడి బాలిక మృతి

Yadadri: యాదాద్రి కొండ కింద గండి చెరువు ప్రాంగణంలో గల లక్ష్మి పుష్కరిణిలో పడి ఓ బాలిక మృతి చెందింది. కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరిణిలో స్నానానిరి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో పడగా.. ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు హైదరాబాద్ గుడి మల్కాపూర్​కి చెందిన బొంతల రోజా(15)గా గుర్తించారు. బాలిక మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దైవదర్శనానికి వచ్చిన తమకు ఇలా జరిగిందంటూ బాలిక తల్లి రోదించిన తీరు పలువురిని కలచివేసింది.

బాలిక మృతితో లక్ష్మి పుష్కరిణిలో భక్తులకు స్నానం ఆచరించడానికి అనుమతిని ఆలయ అధికారులు నిలిపివేశారు. సంప్రోక్షణ తదుపరి అనుమతిస్తామని వెల్లడించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : May 15, 2022, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.