వరుసగా ఆర్థిక మోసాలకు పాల్పడుతోన్న నలుగురు ఘరానా మోసగాళ్ల ముఠాపై సైబరాబాద్ పోలీసులు పీడీ చట్టం నమోదు చేశారు. ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ పేరిట అభిలాష్ థామస్, ప్రేమ్కుమార్, సుబ్రహ్మణ్యం, షరీఫ్లు కలిసి గొలుసు కట్టు మోసాలకు తెర తీశారు. దేశ వ్యాప్తంగా సుమారు పది లక్షల మంది వద్ద 1,500 కోట్ల వరకు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి.
ఈ ముఠాపై గచ్చిబౌలితో పాటు రామచంద్రాపురం పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఆర్థిక నేరాలను అరికట్టేందుకు పోలీసుల చర్యల్లో భాగంగా నిందితులపై పీడీ చట్టం నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.