ETV Bharat / crime

Financial Frauds: సామాన్యుల ఆశలే పెట్టుబడి.. అడుగడుగునా మోసగాళ్ల అలజడి

Financial Frauds in Telangana: ''జనాలకు లాజిక్కులు అవసరం లేదు సార్.. మ్యాజిక్​లే కావాలి.. అందుకే ప్రపంచంలో శాస్త్రవేత్తల కన్నా.. బాబాలకే డిమాండ్ ఎక్కువ'' అని ఓ సినిమాలో హీరో చెప్తాడు. అలాంటి మ్యాజిక్​లు నమ్మి.. దొంగ బాబాల మాటలు విని.. ఎందరో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సామాన్యుల ఆశలే పెట్టుబడిగా.. అడుగడుగునా మోసం చేస్తూ కేటుగాళ్లు మాత్రం లాభాలు పొందుతున్నారు.

author img

By

Published : Dec 10, 2021, 8:14 AM IST

Financial Frauds
మోసగాళ్ల అలజడి

Financial Frauds in Telangana: మనుషుల అవసరాలు.. అమాయకుల నమ్మకాలు.. సామాన్యుల బలహీనతలే ఆసరాగా జరుగుతున్న మోసాలెన్నో! గుప్త నిధులంటూ కొందరు.. సులభంగా డబ్బు సంపాదన పేరుతో ఇంకొందరు.. ఉద్యోగాలిప్తిస్తామని ఒకరు.. డబ్బు రెట్టింపు చేస్తామంటూ మరొకరు.. ఇలా నమ్మకమే పెట్టుబడిగా మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. నిరక్షరాస్యులో, గ్రామీణులో కాదు.. ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు కూడా ఇలాంటి మోసాలకు బలవుతుండటమే విశేషం. రైస్‌ పుల్లింగ్‌ యంత్రాలు, డబ్బును రెట్టింపు చేసే యజ్ఞాలు, బంగారాన్ని మెరుగుపెట్టే రసాయనాలు.. అదృష్టాన్ని తెచ్చిపెట్టే రెండు తలల పాములు ఒకటేమిటి రకరకాల పేర్లతో మాయగాళ్లు చెలరేగిపోతున్నారు.

ఆగని రైస్‌పుల్లింగ్‌..

‘ఇదొక అద్భుత యంత్రం. దీంతో డబ్బు రెట్టింపవుతుంది, గుప్త నిధులను కనిపెడుతుంది. మిమ్మల్ని రూ.కోటీశ్వరులను చేస్తుంది’ అంటూ రైస్‌పుల్లింగ్‌ యంత్రాల మాటున జరుగుతున్న మోసాలు ఇప్పటివి కావు. ఎంతమంది మోసపోతున్నా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉండడం విశేషం. ఇలా మోసం చేస్తున్న 14 మంది సభ్యుల ముఠాను శంషాబాద్‌ పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. తాజాగా ఏపీలోని చిత్తూరు పోలీసులకు కూడా ఇలాంటి ముఠా పట్టుబడింది.

డబ్బులు రెట్టింపు చేసే యజ్ఞం

ఈ యజ్ఞం చేస్తే డబ్బు రెట్టింపు అవుతుందంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మించేలా చేయడమే దొంగ బాబాల పని. గతంలో హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఇలానే నమ్మి రూ. 50 లక్షలు పోగొట్టుకున్నారు. డబ్బు రెట్టింపవుతుందని చెబుతూ మొదట రూ. 5 లక్షలు పెట్టించి పూజలు చేసిన దొంగ బాబాలు అన్నట్లుగానే రూ. 10 లక్షలు ఇచ్చారు. దాంతో నమ్మకం కుదిరిన సదరు పారిశ్రామివేత్త తర్వాత రూ. 50 లక్షలు పెట్టాడు. ఆ డబ్బుతో బాబాలు ఉడాయించారు. దాంతో లబోదిబోమంటూ సదరు పారిశ్రామివేత్త పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటికీ ఇలాంటివాటిని కొందరు నమ్ముతుండటంతో పూజలు, యజ్ఞాలు చేస్తే శుభం జరుగుతుంది, కష్టాలు తొలిగిపోతాయంటూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పంట పండుతూనే ఉంది.

కరక్కాయలు పొడి చేయండి

‘ఇంట్లోనే ఉండి నెలనెలా రూ.వేలకు వేలు ఆర్జించండి’ అంటూ అనేక కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. దీనికో ఉదాహరణ కరక్కాయ పొడి మోసం. రూ.వెయ్యి పెట్టి సభ్యత్వం తీసుకుంటే కిలో కరక్కాయలు ఇస్తామని, వాటిని పొడి చేసి మళ్లీ తమకే అమ్ముకోవచ్చని ‘సాఫ్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ మల్టీ టూల్స్‌’ అనే సంస్థ ప్రచారం చేసింది. కిలో కరక్కాయలకు రూ. 300 చొప్పున లాభం పొందవచ్చని పేర్కొంది. ఇంట్లో ఉండేదే కదా అన్న ఉద్దేశంతో వందలమంది ఎగబడ్డారు. మొదట్లో చేరిన వారికి డబ్బులు పంచిన ఆ సంస్థ తర్వాత పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసి పారిపోయింది. అలానే ఆయుర్వేద గుణాలున్న మునక్కాయల పొడి చేసి ఇచ్చినా లాభం వస్తుందంటూ మరో సంస్థ చేసిన ప్రచారానికీ అనేకమంది బలయ్యారు.

చిక్కితే చిక్కులే

ప్రభుత్వ కార్యాలయాల్లో రకరకాల పనులు చేసిపెడతామనే దళారులు చేసే మోసాలెన్నో. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్దా ఇలాంటివారు తారసపడుతుంటారు. రాజధానిలో అయితే వీరి సంఖ్య వందల్లో ఉంటుంది. బదిలీలు మొదలు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు సంబంధించిన పనులు తాము చేసి పెడతామంటూ వీరు నమ్మబలుకుతారు. ఇంటి నిర్మాణం, వ్యాపార, పన్ను వివాదాలూ.. ఒకటేమిటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనైనా చక్కబెట్టేస్తామనే దళారులు ఎక్కడ చూసినా కనిపిస్తారు. వీరిలో ఎక్కువ మంది నయవంచకులే ఉంటారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మస్కా

ఈ మోసాలు నిత్యకృత్యం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలంటూ అనేకమంది మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఏదైనా ఉద్యోగ ప్రకటన విడుదల చేయగానే పైరవీకారులు తయారవుతారు. ఫలానా అధికారి తనకు తెలుసు, ఫలానా మంత్రి నాకు మిత్రుడు అంటూ నమ్మబలుకుతారు. ఇదంతా వ్యవస్థీకృతంగా జరుగుతుంది. వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉండటం పైరవీకారులకు కలిసి వచ్చే అంశం. ఉన్నతాధికారులు తమకు తెలుసని చెబుతారు. ముందు రూ.5 లక్షలు బ్యాంకులో వేయాలంటారు. ఉద్యోగం వస్తే మరో రూ.5 లక్షలు ఇవ్వాలని, రాకపోతే ఖర్చుల కింద రూ.2 లక్షలు ఉంచుకొని మిగతావి తిరిగి ఇచ్చేస్తామంటారు. ఒకవేళ సదరు నిరుద్యోగి తన స్వయంశక్తితో ఉద్యోగం తెచ్చుకుంటే అది తమ ఘనతేనని మిగతా డబ్బు వసూలు చేస్తారు. రాకపోతే రూ. 2 లక్షలు ఉంచుకొని మిగతావి తిరిగి ఇస్తారు. నమ్మకం కలిగించేందుకు వీరు చాలా నాటకాలు ఆడతారు. అభ్యర్థిని వెంటబెట్టుకొని మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలకు వస్తారు. ఇతరులను లోనికి అనుమతించరని చెబుతూ వారిని బయటే ఉంచుతారు. వీరు మాత్రం విజిటర్స్‌ పాసుల ద్వారా లోనికి వెళ్లి తిరిగి వస్తారు. ఇక పని అయిపోయినట్లేనని బీరాలు పలుకుతారు. ఉద్యోగం వచ్చినా, రాకపోయినా పైరవీకారుల లాభం మాత్రం ఎక్కడికీ పోదు. ఉద్యోగాల పేరుతో యువతులను లైంగికంగా వేధిస్తున్నారు కొందరు. ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇలా దాదాపు 200 మందిని లైంగికంగా వేధించిన కీచకుణ్ని గతంలో అరెస్టు చేశారు.

మాయమాటలు నమ్మకండి

ప్రపంచంలో ఎక్కడా డబ్బు రెట్టింపు చేసే యజ్ఞాలు, గుప్త నిధులు కనుక్కొనే యంత్రాలు ఉండవు. ఇదంతా మూఢనమ్మకం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ మోసగాళ్ల మాటలకు బోల్తా పడుతుంటారు. అలాగే ఈ రోజుల్లో డబ్బులు పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకోవడం సాధ్యంకాదు. చాలావరకూ ఉద్యోగ పరీక్షలన్నీ పకడ్బందీగా జరుగుతున్నాయి. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే అది కచ్చితంగా బూటకమే. ఇక కరక్కాయలు, మునక్కాయలు పొడి చేస్తే డబ్బు ఇస్తామంటే నమ్మడం పూర్తిగా అజ్ఞానం. కేటుగాళ్లు ఇలాంటి కిటుకులు ఎన్నో అమలు చేస్తుంటారు. ఇటువంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు తెలియజేస్తే మేలు.

ఇదీ చూడండి: Real Estate Fraud: స్థిరాస్తి గాలం.. ఏటా రూ. వందల కోట్ల మేర వంచన

Financial Frauds in Telangana: మనుషుల అవసరాలు.. అమాయకుల నమ్మకాలు.. సామాన్యుల బలహీనతలే ఆసరాగా జరుగుతున్న మోసాలెన్నో! గుప్త నిధులంటూ కొందరు.. సులభంగా డబ్బు సంపాదన పేరుతో ఇంకొందరు.. ఉద్యోగాలిప్తిస్తామని ఒకరు.. డబ్బు రెట్టింపు చేస్తామంటూ మరొకరు.. ఇలా నమ్మకమే పెట్టుబడిగా మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. నిరక్షరాస్యులో, గ్రామీణులో కాదు.. ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు కూడా ఇలాంటి మోసాలకు బలవుతుండటమే విశేషం. రైస్‌ పుల్లింగ్‌ యంత్రాలు, డబ్బును రెట్టింపు చేసే యజ్ఞాలు, బంగారాన్ని మెరుగుపెట్టే రసాయనాలు.. అదృష్టాన్ని తెచ్చిపెట్టే రెండు తలల పాములు ఒకటేమిటి రకరకాల పేర్లతో మాయగాళ్లు చెలరేగిపోతున్నారు.

ఆగని రైస్‌పుల్లింగ్‌..

‘ఇదొక అద్భుత యంత్రం. దీంతో డబ్బు రెట్టింపవుతుంది, గుప్త నిధులను కనిపెడుతుంది. మిమ్మల్ని రూ.కోటీశ్వరులను చేస్తుంది’ అంటూ రైస్‌పుల్లింగ్‌ యంత్రాల మాటున జరుగుతున్న మోసాలు ఇప్పటివి కావు. ఎంతమంది మోసపోతున్నా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉండడం విశేషం. ఇలా మోసం చేస్తున్న 14 మంది సభ్యుల ముఠాను శంషాబాద్‌ పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. తాజాగా ఏపీలోని చిత్తూరు పోలీసులకు కూడా ఇలాంటి ముఠా పట్టుబడింది.

డబ్బులు రెట్టింపు చేసే యజ్ఞం

ఈ యజ్ఞం చేస్తే డబ్బు రెట్టింపు అవుతుందంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మించేలా చేయడమే దొంగ బాబాల పని. గతంలో హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఇలానే నమ్మి రూ. 50 లక్షలు పోగొట్టుకున్నారు. డబ్బు రెట్టింపవుతుందని చెబుతూ మొదట రూ. 5 లక్షలు పెట్టించి పూజలు చేసిన దొంగ బాబాలు అన్నట్లుగానే రూ. 10 లక్షలు ఇచ్చారు. దాంతో నమ్మకం కుదిరిన సదరు పారిశ్రామివేత్త తర్వాత రూ. 50 లక్షలు పెట్టాడు. ఆ డబ్బుతో బాబాలు ఉడాయించారు. దాంతో లబోదిబోమంటూ సదరు పారిశ్రామివేత్త పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటికీ ఇలాంటివాటిని కొందరు నమ్ముతుండటంతో పూజలు, యజ్ఞాలు చేస్తే శుభం జరుగుతుంది, కష్టాలు తొలిగిపోతాయంటూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పంట పండుతూనే ఉంది.

కరక్కాయలు పొడి చేయండి

‘ఇంట్లోనే ఉండి నెలనెలా రూ.వేలకు వేలు ఆర్జించండి’ అంటూ అనేక కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. దీనికో ఉదాహరణ కరక్కాయ పొడి మోసం. రూ.వెయ్యి పెట్టి సభ్యత్వం తీసుకుంటే కిలో కరక్కాయలు ఇస్తామని, వాటిని పొడి చేసి మళ్లీ తమకే అమ్ముకోవచ్చని ‘సాఫ్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ మల్టీ టూల్స్‌’ అనే సంస్థ ప్రచారం చేసింది. కిలో కరక్కాయలకు రూ. 300 చొప్పున లాభం పొందవచ్చని పేర్కొంది. ఇంట్లో ఉండేదే కదా అన్న ఉద్దేశంతో వందలమంది ఎగబడ్డారు. మొదట్లో చేరిన వారికి డబ్బులు పంచిన ఆ సంస్థ తర్వాత పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసి పారిపోయింది. అలానే ఆయుర్వేద గుణాలున్న మునక్కాయల పొడి చేసి ఇచ్చినా లాభం వస్తుందంటూ మరో సంస్థ చేసిన ప్రచారానికీ అనేకమంది బలయ్యారు.

చిక్కితే చిక్కులే

ప్రభుత్వ కార్యాలయాల్లో రకరకాల పనులు చేసిపెడతామనే దళారులు చేసే మోసాలెన్నో. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్దా ఇలాంటివారు తారసపడుతుంటారు. రాజధానిలో అయితే వీరి సంఖ్య వందల్లో ఉంటుంది. బదిలీలు మొదలు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు సంబంధించిన పనులు తాము చేసి పెడతామంటూ వీరు నమ్మబలుకుతారు. ఇంటి నిర్మాణం, వ్యాపార, పన్ను వివాదాలూ.. ఒకటేమిటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనైనా చక్కబెట్టేస్తామనే దళారులు ఎక్కడ చూసినా కనిపిస్తారు. వీరిలో ఎక్కువ మంది నయవంచకులే ఉంటారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మస్కా

ఈ మోసాలు నిత్యకృత్యం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలంటూ అనేకమంది మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఏదైనా ఉద్యోగ ప్రకటన విడుదల చేయగానే పైరవీకారులు తయారవుతారు. ఫలానా అధికారి తనకు తెలుసు, ఫలానా మంత్రి నాకు మిత్రుడు అంటూ నమ్మబలుకుతారు. ఇదంతా వ్యవస్థీకృతంగా జరుగుతుంది. వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉండటం పైరవీకారులకు కలిసి వచ్చే అంశం. ఉన్నతాధికారులు తమకు తెలుసని చెబుతారు. ముందు రూ.5 లక్షలు బ్యాంకులో వేయాలంటారు. ఉద్యోగం వస్తే మరో రూ.5 లక్షలు ఇవ్వాలని, రాకపోతే ఖర్చుల కింద రూ.2 లక్షలు ఉంచుకొని మిగతావి తిరిగి ఇచ్చేస్తామంటారు. ఒకవేళ సదరు నిరుద్యోగి తన స్వయంశక్తితో ఉద్యోగం తెచ్చుకుంటే అది తమ ఘనతేనని మిగతా డబ్బు వసూలు చేస్తారు. రాకపోతే రూ. 2 లక్షలు ఉంచుకొని మిగతావి తిరిగి ఇస్తారు. నమ్మకం కలిగించేందుకు వీరు చాలా నాటకాలు ఆడతారు. అభ్యర్థిని వెంటబెట్టుకొని మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలకు వస్తారు. ఇతరులను లోనికి అనుమతించరని చెబుతూ వారిని బయటే ఉంచుతారు. వీరు మాత్రం విజిటర్స్‌ పాసుల ద్వారా లోనికి వెళ్లి తిరిగి వస్తారు. ఇక పని అయిపోయినట్లేనని బీరాలు పలుకుతారు. ఉద్యోగం వచ్చినా, రాకపోయినా పైరవీకారుల లాభం మాత్రం ఎక్కడికీ పోదు. ఉద్యోగాల పేరుతో యువతులను లైంగికంగా వేధిస్తున్నారు కొందరు. ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇలా దాదాపు 200 మందిని లైంగికంగా వేధించిన కీచకుణ్ని గతంలో అరెస్టు చేశారు.

మాయమాటలు నమ్మకండి

ప్రపంచంలో ఎక్కడా డబ్బు రెట్టింపు చేసే యజ్ఞాలు, గుప్త నిధులు కనుక్కొనే యంత్రాలు ఉండవు. ఇదంతా మూఢనమ్మకం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ మోసగాళ్ల మాటలకు బోల్తా పడుతుంటారు. అలాగే ఈ రోజుల్లో డబ్బులు పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకోవడం సాధ్యంకాదు. చాలావరకూ ఉద్యోగ పరీక్షలన్నీ పకడ్బందీగా జరుగుతున్నాయి. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే అది కచ్చితంగా బూటకమే. ఇక కరక్కాయలు, మునక్కాయలు పొడి చేస్తే డబ్బు ఇస్తామంటే నమ్మడం పూర్తిగా అజ్ఞానం. కేటుగాళ్లు ఇలాంటి కిటుకులు ఎన్నో అమలు చేస్తుంటారు. ఇటువంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు తెలియజేస్తే మేలు.

ఇదీ చూడండి: Real Estate Fraud: స్థిరాస్తి గాలం.. ఏటా రూ. వందల కోట్ల మేర వంచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.