ETV Bharat / crime

పిడుగు పాటుకు రైతు మృతి

మహబూబ్​ నగర్​ జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగు పాటుకు గురై ఓ రైతు మృతి చెందాడు.

author img

By

Published : May 2, 2021, 9:21 AM IST

farmer died
farmer died

పిడుగు పాటుకు గురై.. రైతు మృతి చెందిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లాలో చోటుచేసుకొంది. పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన తిరుపతి రెడ్డి (36) శనివారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్నాడు. చెరువు కట్ట వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భర్త మృతితో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.

పిడుగు పాటుకు గురై.. రైతు మృతి చెందిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లాలో చోటుచేసుకొంది. పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన తిరుపతి రెడ్డి (36) శనివారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్నాడు. చెరువు కట్ట వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భర్త మృతితో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.

ఇదీ చదవండి: కరోనాతో యువకుడు మృతి.. జేసీబీ సహాయంతో దహన సంస్కారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.