Explosive material: హైదరాబాద్లోని నవతా ట్రాన్స్పోర్టు కొరియర్లో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. వనస్థలిపురం ట్రాన్స్పోర్టు కార్యాలయంలో ఓ పార్సిల్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో ట్రాన్స్పోర్టు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించగా ఈ విషయం బయటపడింది.
ఈ నెల 14న చిలకలూరిపేట నుంచి పుణెకు 8 కార్టన్ల పార్సిల్ను విశాల్ అనే వ్యక్తి బుకింగ్ చేసినట్లు ట్రాన్స్పోర్ట్ సిబ్బంది తెలిపారు. ఈనెల 15న హైదరాబాద్లోని నవతా ట్రాన్స్పోర్ట్కు పార్సిల్ చేరుకున్నట్లు వెల్లడించారు. అనుమానంతో 8 కార్టన్లను దూరంగా తీసుకెళ్లిన ట్రాన్స్పోర్టు సిబ్బంది అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.
పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిపై ఆరా తీశారు. అయితే అవి సినిమాల్లో వాడే బాంబులుగా పోలీసులు తేల్చారు. పార్సిల్లో 135 కిలోల బరువున్న 100 బాంబులు ఉండగా.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: