ETV Bharat / crime

యజమాని కోసం శునకం మౌనరోదన..

author img

By

Published : Apr 8, 2021, 9:25 AM IST

తన ఆకలి తీర్చి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న యజమాని చలనం లేకుండా పడి ఉండడం చూసి ఆ మూగజీవి తట్టుకోలేకపోయింది.. శాశ్వతంగా దూరమయ్యాడని అనుకుందేమో మృతదేహం వద్ద నుంచి కదలకుండా మౌనంగా రోదించింది ఆ శునకం. మాటలే వచ్చి ఉంటే బోరున విలపించేదేమో.. ఇలా గంటలకొద్దీ ఘటన స్థలంలోనే ఉండడం చూసి మూగజీవి ప్రేమకు విలువ కట్టలేమంటూ కన్నీరుమున్నీరయ్యారు అక్కడికి వచ్చినవారు.

dog cries for owner, dog cries for owner in asifabad
శునకం మౌనరోదన, ఆసిఫాబాద్ వార్తలు

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌ మండలం కాకడ్‌బొడ్డికి చెందిన ఆత్రంభీం... సంభాజిగూడెంలో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో పొలంలో విద్యుదాఘాతానికి గురైన భీం.. అక్కడే కుప్పకూలిపోయాడు.

యజమాని కోసం శునకం మౌనరోదన

దీనిని గమనించిన అతని పెంపుడు కుక్క... యజమానిని తట్టిలేపేందుకు శతవిధాలుగా ప్రయత్నించింది. భీం ఎంతకూ కళ్లు తెరవకపోవటంతో.... మృతదేహం చుట్టే తిరుగుతూ, మౌనంగా రోదించింది. ఈ ఘటన అక్కడున్న వారి కళ్లు చెమర్చేలా చేసింది.

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌ మండలం కాకడ్‌బొడ్డికి చెందిన ఆత్రంభీం... సంభాజిగూడెంలో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో పొలంలో విద్యుదాఘాతానికి గురైన భీం.. అక్కడే కుప్పకూలిపోయాడు.

యజమాని కోసం శునకం మౌనరోదన

దీనిని గమనించిన అతని పెంపుడు కుక్క... యజమానిని తట్టిలేపేందుకు శతవిధాలుగా ప్రయత్నించింది. భీం ఎంతకూ కళ్లు తెరవకపోవటంతో.... మృతదేహం చుట్టే తిరుగుతూ, మౌనంగా రోదించింది. ఈ ఘటన అక్కడున్న వారి కళ్లు చెమర్చేలా చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.