ETV Bharat / crime

Daughter-in-law harassment : మా కోడలు వేధిస్తోంది.. కాల్​ రికార్డ్ చేస్తూ... ఆ తర్వాత...

author img

By

Published : Oct 22, 2021, 11:58 AM IST

ఏ అత్తమామలైనా తమ ఇంటికి వచ్చే కోడలు మహాలక్ష్మిలాగా ఉండి... తమ ఇంటిని చక్కదిద్దే బాధ్యతను చేపట్టాలని కోరుకుంటారు. అలాంటి ఆశతోనే కరీంనగర్‌కు చెందిన వృద్ధ దంపతులు... తమ కుమారుడికి పెళ్లి చేశారు. ఇంటికి వచ్చిన కోడలును చూసి సంబురపడ్డారు. కానీ ఆ కోడలు అమ్మానాన్న లాంటి అత్తమామలను మోసం చేయడం ప్రారంభించింది. వృద్ధప్యంలో కాసింత కలో గంజో పోస్తుందనుకున్న కోడలు వేధించడం (Daughter-in-law harassment)మెుదలుపెట్టింది. దీంతో ఆ వృద్ధ దంపతులు ఏం చేశారో తెలుసా..!

Daughter-in-law harassment
Daughter-in-law harassment

మాతోపాటు ఉంటున్న కోడలు మా వ్యాపారాన్ని కొడుకుతో సహా సొంతం చేసుకున్నా ఏమీ అనలేదు.. వృద్ధులైన మమ్మల్ని వేధిస్తున్నా(Daughter-in-law harassment) భరించాం.. ఇంట్లో బంగారు ఆభరణాలు, వారసత్వ వస్తువులు కనిపించకపోతే.. తీసుకున్నది కోడలు.. కొడుకేనని తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వదిలేశాం... మేం మాట్లాడే ప్రతిమాటా విని కక్ష తీర్చుకుంటోందని తెలుసుకున్నాక అక్కడ ఉండడం మా ప్రాణాలకే ప్రమాదమని తెలిసి పోలీసులను ఆశ్రయించాం’’ అని కరీంనగర్‌కు చెందిన వైకుంఠం పోలీస్‌ అధికారులకు తెలిపాడు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆయనతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వృద్ధులమైన తాము అప్పట్లో ఫిర్యాదు చేసేందుకు రాలేదంటూ పోలీసులకు చెప్పాడు. కరీంనగర్‌లో తమకు వస్త్ర దుకాణం ఉందని, నలుగురు కుమారుల్లో ఒకరు అమెరికా, మరొకరు బెంగళూరు, ఇంకొకరు హైదరాబాద్‌లో ఉన్నారని వీరంతా ఉద్యోగాలు చేస్తుండగా.. తమతో పాటు ఉంటున్న కుమారుడు, కోడలు మాత్రం తమ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు కొన్నేళ్ల నుంచి వేధిస్తున్నారని వివరించాడు.

వీలునామా మాటలతో మరింత ఆగ్రహం..

వైకుంఠం, ఆయన భార్యను వారి కోడలు ఆస్తి విషయంలో వేధిస్తోంది. కొడుకుతో ఈ విషయం చెప్పినా.. ఫలితం లేకపోవడంతో హైదరాబాద్‌లోని మరో కుమారుడితో తమ బాధలను పంచుకునేవారు. సరిగ్గా అప్పుడే వీరి మాటలు వినేందుకు వైకుంఠం చరవాణిలో రికార్డింగ్‌ మైకాల్‌ యాప్‌ను(recording my call app) డౌన్‌లోడ్‌ చేసింది. వైకుంఠం ఫోన్లో మాట్లాడే మాటలు వినేందుకు ఆ యాప్‌ను గూగుల్‌ క్లౌడ్‌ ద్వారా తన ఈ-మెయిల్‌కు అనుసంధానం చేసుకుంది. వైకుంఠం మాట్లాడే ప్రతిమాటా విని తన గురించి ఏదైనా మాట్లాడితే.. వెంటనే వారిపై కోప్పడేది. భోజనం సరిగా పెట్టేది కాదు.. వీలునామా రాద్దామని భావిస్తున్నానని, కరీంనగర్‌లో రాయిస్తే.. ఇద్దరికీ తెలిసిపోతుందని హైదరాబాద్‌లోని కొడుకుకు వివరించగా... తనవద్దకు రావాలని సూచించాడు. ఈ మాటలు విన్న కోడలు మరింత ఆగ్రహంతో వేధింపులు తీవ్రం చేసింది.

ఇలా తెలిసింది..

హైదరాబాద్‌లో కొద్దిరోజులున్న వైకుంఠం దంపతులు కరీంనగర్‌కు తిరిగివెళ్లారు. బంగారు ఆభరణాలు, వస్తువులు కనిపించకపోవడతో ప్రశ్నించగా గృహహింస కేసు(Domestic violence case) పెడతానని కోడలు వారిని బెదిరించింది. ఆమె చర్యలతో వైకుంఠం అనారోగ్యం పాలయ్యాడు. కరీంనగర్‌లోని ఆసుపత్రిలో చేర్పించగా.. హైదరాబాద్‌లో ఉన్న కుమారుడు చూసేందుకు వెళ్లాడు. ఒకరోజు వైకుంఠానికి ఎవరో ఫోన్‌ చేయగా కొడుకు మాట్లాడాడు. సంభాషణ పూర్తయ్యాక కాల్‌ రికార్డ్‌(call recording) సక్సెస్‌ఫుల్‌ అంటూ చరవాణి తెరపై కనిపించింది. దీంతో అతడు ఫోన్‌ను పరీక్షించగా... రికార్డ్‌ మై కాల్‌ యాప్‌ కనిపించింది. కొద్దిరోజులయ్యాక మెరుగైన వైద్యం కోసం వారు హైదరాబాద్‌కు వచ్చాక ఆయన ఫోన్‌కాల్‌ రికార్డింగ్‌ విషయం చెప్పారు. ఆరోగ్యం కుదుటపడ్డాక మూడురోజుల క్రితం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: ఆస్తి పంచడం లేదని ఓ కోడలు ఎంతకి తెగించిందంటే..

మాతోపాటు ఉంటున్న కోడలు మా వ్యాపారాన్ని కొడుకుతో సహా సొంతం చేసుకున్నా ఏమీ అనలేదు.. వృద్ధులైన మమ్మల్ని వేధిస్తున్నా(Daughter-in-law harassment) భరించాం.. ఇంట్లో బంగారు ఆభరణాలు, వారసత్వ వస్తువులు కనిపించకపోతే.. తీసుకున్నది కోడలు.. కొడుకేనని తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వదిలేశాం... మేం మాట్లాడే ప్రతిమాటా విని కక్ష తీర్చుకుంటోందని తెలుసుకున్నాక అక్కడ ఉండడం మా ప్రాణాలకే ప్రమాదమని తెలిసి పోలీసులను ఆశ్రయించాం’’ అని కరీంనగర్‌కు చెందిన వైకుంఠం పోలీస్‌ అధికారులకు తెలిపాడు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆయనతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వృద్ధులమైన తాము అప్పట్లో ఫిర్యాదు చేసేందుకు రాలేదంటూ పోలీసులకు చెప్పాడు. కరీంనగర్‌లో తమకు వస్త్ర దుకాణం ఉందని, నలుగురు కుమారుల్లో ఒకరు అమెరికా, మరొకరు బెంగళూరు, ఇంకొకరు హైదరాబాద్‌లో ఉన్నారని వీరంతా ఉద్యోగాలు చేస్తుండగా.. తమతో పాటు ఉంటున్న కుమారుడు, కోడలు మాత్రం తమ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు కొన్నేళ్ల నుంచి వేధిస్తున్నారని వివరించాడు.

వీలునామా మాటలతో మరింత ఆగ్రహం..

వైకుంఠం, ఆయన భార్యను వారి కోడలు ఆస్తి విషయంలో వేధిస్తోంది. కొడుకుతో ఈ విషయం చెప్పినా.. ఫలితం లేకపోవడంతో హైదరాబాద్‌లోని మరో కుమారుడితో తమ బాధలను పంచుకునేవారు. సరిగ్గా అప్పుడే వీరి మాటలు వినేందుకు వైకుంఠం చరవాణిలో రికార్డింగ్‌ మైకాల్‌ యాప్‌ను(recording my call app) డౌన్‌లోడ్‌ చేసింది. వైకుంఠం ఫోన్లో మాట్లాడే మాటలు వినేందుకు ఆ యాప్‌ను గూగుల్‌ క్లౌడ్‌ ద్వారా తన ఈ-మెయిల్‌కు అనుసంధానం చేసుకుంది. వైకుంఠం మాట్లాడే ప్రతిమాటా విని తన గురించి ఏదైనా మాట్లాడితే.. వెంటనే వారిపై కోప్పడేది. భోజనం సరిగా పెట్టేది కాదు.. వీలునామా రాద్దామని భావిస్తున్నానని, కరీంనగర్‌లో రాయిస్తే.. ఇద్దరికీ తెలిసిపోతుందని హైదరాబాద్‌లోని కొడుకుకు వివరించగా... తనవద్దకు రావాలని సూచించాడు. ఈ మాటలు విన్న కోడలు మరింత ఆగ్రహంతో వేధింపులు తీవ్రం చేసింది.

ఇలా తెలిసింది..

హైదరాబాద్‌లో కొద్దిరోజులున్న వైకుంఠం దంపతులు కరీంనగర్‌కు తిరిగివెళ్లారు. బంగారు ఆభరణాలు, వస్తువులు కనిపించకపోవడతో ప్రశ్నించగా గృహహింస కేసు(Domestic violence case) పెడతానని కోడలు వారిని బెదిరించింది. ఆమె చర్యలతో వైకుంఠం అనారోగ్యం పాలయ్యాడు. కరీంనగర్‌లోని ఆసుపత్రిలో చేర్పించగా.. హైదరాబాద్‌లో ఉన్న కుమారుడు చూసేందుకు వెళ్లాడు. ఒకరోజు వైకుంఠానికి ఎవరో ఫోన్‌ చేయగా కొడుకు మాట్లాడాడు. సంభాషణ పూర్తయ్యాక కాల్‌ రికార్డ్‌(call recording) సక్సెస్‌ఫుల్‌ అంటూ చరవాణి తెరపై కనిపించింది. దీంతో అతడు ఫోన్‌ను పరీక్షించగా... రికార్డ్‌ మై కాల్‌ యాప్‌ కనిపించింది. కొద్దిరోజులయ్యాక మెరుగైన వైద్యం కోసం వారు హైదరాబాద్‌కు వచ్చాక ఆయన ఫోన్‌కాల్‌ రికార్డింగ్‌ విషయం చెప్పారు. ఆరోగ్యం కుదుటపడ్డాక మూడురోజుల క్రితం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: ఆస్తి పంచడం లేదని ఓ కోడలు ఎంతకి తెగించిందంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.