ETV Bharat / crime

తలనీలాలు ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు - అప్పనపల్లిలోని శ్రీ బాల బాలాజీ స్వామి తలనీలాలు చోరీ

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లిలోని శ్రీ బాల బాలాజీ స్వామికి భక్తులు సమర్పించిన తలనీలాలు చోరీకి గురయ్యాయి. దీనిపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. నిందితులు త్వరగా పట్టుకోవాలని పోలీసులను కోరారు.

బాల బాలాజీకి సమర్పించిన తలనీలాలు ఎత్తుకెళ్లారు
బాల బాలాజీకి సమర్పించిన తలనీలాలు ఎత్తుకెళ్లారు
author img

By

Published : Jan 22, 2021, 8:33 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లిలో శ్రీ బాల బాలాజీ స్వామికి భక్తులు సమర్పించిన తలనీలాలు చోరీకి గురయ్యాయి. ఈనెల 20వ తేదీ రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో దుండగులు చోరీకి పాల్పడినట్లు ఆలయ అధికారులు భావిస్తున్నారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఆలయ సహాయ కార్యదర్శి పి.బాబురావు, ఎమ్మెల్యే చిట్టిబాబుకు వివరించారు. చోరీకి సంబంధించిన వివరాలను వేగవంతంగా దర్యాప్తు చేసి.. నిందితులను పట్టుకోవాలని ఎమ్మెల్యే చిట్టి బాబు పోలీసులను కోరారు.

ఇదీ చదవండి: ఫ్లెక్సీ వివాదం: తెరాస, కాంగ్రెస్​ కాంగ్రెస్​ కార్యకర్తల బాహాబాహీ

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లిలో శ్రీ బాల బాలాజీ స్వామికి భక్తులు సమర్పించిన తలనీలాలు చోరీకి గురయ్యాయి. ఈనెల 20వ తేదీ రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో దుండగులు చోరీకి పాల్పడినట్లు ఆలయ అధికారులు భావిస్తున్నారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఆలయ సహాయ కార్యదర్శి పి.బాబురావు, ఎమ్మెల్యే చిట్టిబాబుకు వివరించారు. చోరీకి సంబంధించిన వివరాలను వేగవంతంగా దర్యాప్తు చేసి.. నిందితులను పట్టుకోవాలని ఎమ్మెల్యే చిట్టి బాబు పోలీసులను కోరారు.

ఇదీ చదవండి: ఫ్లెక్సీ వివాదం: తెరాస, కాంగ్రెస్​ కాంగ్రెస్​ కార్యకర్తల బాహాబాహీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.