ETV Bharat / crime

కుమారుడికి ప్రాణాంతక వ్యాధి.. రూ.కోటి సాయమందిస్తామన్న దాతలు.. అంతలోనే..!

Couple Death in Road Accident: వారిది నిరుపేద కుటుంబం. ఇద్దరు కుమారులతో సంతోషంగా జీవిస్తున్నారు. అంతలోనే చిన్న కుమారుడికి ప్రాణాంతక వ్యాధి సోకడంతో వారి కాళ్లకింద భూమి కంపించింది. వీరి గుండెకోతను అర్థం చేసుకున్న దాతలు.. ఏకంగా రూ.కోటి సాయం చేస్తామన్నారు. బిడ్డను బతికించుకుంటామనే ఆశ చిగురించింది. చికిత్స కోసం వెళ్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

author img

By

Published : Oct 4, 2022, 12:38 PM IST

కుమారుడికి ప్రాణాంతక వ్యాధి.. రూ.కోటి సాయమందిస్తామన్న దాతలు.. అంతలోనే..!
కుమారుడికి ప్రాణాంతక వ్యాధి.. రూ.కోటి సాయమందిస్తామన్న దాతలు.. అంతలోనే..!

Couple Death in Road Accident: తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా కళ్లిపట్టుకు చెందిన బాలమురుగన్‌(45), సెల్వి(36) దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి కుటుంబం కూలీ చేసుకుంటూ చాలా రోజులుగా బెంగళూరులోనే ఉంటోంది. నాలుగేళ్ల చిన్న కుమారుడికి ప్రాణాంతక వ్యాధిని గుర్తించారు. చికిత్సకు బెంగళూరులోని ఓ సంస్థ రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ సొమ్ముతో చికిత్స చేయించేందుకు ఆ కుటుంబం సిద్ధమైంది. పెద్దబాబును బెంగళూరు కత్రిగుప్పెలోని తాత వద్ద ఉంచి, శుక్రవారం తమిళనాడులోని స్వగ్రామానికి వచ్చారు. కొంత డబ్బును సమకూర్చుకున్నాక.. కళ్లిపట్టు నుంచి బంధువులున్న ఏపీలోని చిత్తూరు జిల్లా బలిజకండ్రిగ చేరుకుని.. ఆదివారం రాత్రి 9.30 గంటలకు కేఎస్‌ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు ప్రయాణమయ్యారు.

హొసకోటె మైలాపుర గేటు వద్ద అర్ధరాత్రి వేళ రోడ్డు పక్కన రాళ్ల లోడుతో నిలిపి ఉంచిన లారీని ఆ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బాలమురుగన్‌, సెల్వి మాంసం ముద్దలుగా మారారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడగా బెంగళూరు మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వారిలో బాలమురుగన్‌ కుమారుడు కూడా ఉన్నాడు. అసలే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. ప్రమాదానికి డ్రైవరు నిర్లక్ష్యమే కారణమని, పరారీలో ఉన్నాడని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ మలికార్జున బాలదండి తెలిపారు. ఘటనలో చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలవాసులు పలువురికి గాయాలయ్యాయి. సోమవారం రాత్రి 8 గంటలకు మృతదేహాలు కళ్లిపట్టుకు చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు సరిహద్దులోని ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

ఇవీ చదవండి:

Couple Death in Road Accident: తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా కళ్లిపట్టుకు చెందిన బాలమురుగన్‌(45), సెల్వి(36) దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి కుటుంబం కూలీ చేసుకుంటూ చాలా రోజులుగా బెంగళూరులోనే ఉంటోంది. నాలుగేళ్ల చిన్న కుమారుడికి ప్రాణాంతక వ్యాధిని గుర్తించారు. చికిత్సకు బెంగళూరులోని ఓ సంస్థ రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ సొమ్ముతో చికిత్స చేయించేందుకు ఆ కుటుంబం సిద్ధమైంది. పెద్దబాబును బెంగళూరు కత్రిగుప్పెలోని తాత వద్ద ఉంచి, శుక్రవారం తమిళనాడులోని స్వగ్రామానికి వచ్చారు. కొంత డబ్బును సమకూర్చుకున్నాక.. కళ్లిపట్టు నుంచి బంధువులున్న ఏపీలోని చిత్తూరు జిల్లా బలిజకండ్రిగ చేరుకుని.. ఆదివారం రాత్రి 9.30 గంటలకు కేఎస్‌ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు ప్రయాణమయ్యారు.

హొసకోటె మైలాపుర గేటు వద్ద అర్ధరాత్రి వేళ రోడ్డు పక్కన రాళ్ల లోడుతో నిలిపి ఉంచిన లారీని ఆ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బాలమురుగన్‌, సెల్వి మాంసం ముద్దలుగా మారారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడగా బెంగళూరు మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వారిలో బాలమురుగన్‌ కుమారుడు కూడా ఉన్నాడు. అసలే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. ప్రమాదానికి డ్రైవరు నిర్లక్ష్యమే కారణమని, పరారీలో ఉన్నాడని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ మలికార్జున బాలదండి తెలిపారు. ఘటనలో చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలవాసులు పలువురికి గాయాలయ్యాయి. సోమవారం రాత్రి 8 గంటలకు మృతదేహాలు కళ్లిపట్టుకు చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు సరిహద్దులోని ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

ఇవీ చదవండి:

కోతులు తీసిన ప్రాణం.. నీటమునిగి ఇద్దరు బాలుర దుర్మరణం

ధనుశ్​-శేఖర్​ కమ్ముల ప్రాజెక్ట్​.. స్క్రిప్ట్​ వర్క్​ కంప్లీట్​.. సెట్స్​పైకి అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.