ETV Bharat / crime

అరటి పండు తింటున్న వృద్ధురాలిపై తేనెటీగల దాడి

author img

By

Published : May 17, 2021, 8:32 PM IST

తేనెటీగల దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన నిర్మల్​ జిల్లా సోన్​ మండలం కేంద్రంలో జరిగింది.

Telangana news
తేనెటీగల దాడిలో ముగ్గురికి గాయాలు

అరటి పండు తింటున్న వృద్ధురాలిపై తేనెటీగలు దాడి చేశాయి. ఆమెను కాపాడేందుకు వచ్చిన మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నిర్మల్​ జిల్లా సోన్​ మండల కేంద్రంలో జరిగింది.

మండల కేంద్రానికి చెందిన గజ్జవ్వ (70) జిల్లా కేంద్రంలో పనులు ముగించుకుని ఆటో దిగి బస్టాండ్ ప్రాంతంలో చెట్టు కింద అరటి పండ్లు తింటుండగా చెట్టుపై ఉన్న కోతులు పండ్ల కోసం ఆరాటపడుతూ చెట్టు కొమ్మలను గట్టిగా ఊపాయి. కొమ్మన ఉన్న తేనెతుట్టకదిలి తేనెటీగలు చెలరేగి వృద్ధురాలిపై దాడి చేశాయి. గజ్జవ్వను కాపాడేందుకు ప్రయత్నించిన వెంకటేశ్​, శ్రీనివాస్​పైన దాడి చేశాయి.

తీవ్ర గాయాలైన వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: అర్ధరాత్రి ఇంట్లోకి ఎంటరై.. ఇటుకతో చంపిన దుండగుడు​

అరటి పండు తింటున్న వృద్ధురాలిపై తేనెటీగలు దాడి చేశాయి. ఆమెను కాపాడేందుకు వచ్చిన మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నిర్మల్​ జిల్లా సోన్​ మండల కేంద్రంలో జరిగింది.

మండల కేంద్రానికి చెందిన గజ్జవ్వ (70) జిల్లా కేంద్రంలో పనులు ముగించుకుని ఆటో దిగి బస్టాండ్ ప్రాంతంలో చెట్టు కింద అరటి పండ్లు తింటుండగా చెట్టుపై ఉన్న కోతులు పండ్ల కోసం ఆరాటపడుతూ చెట్టు కొమ్మలను గట్టిగా ఊపాయి. కొమ్మన ఉన్న తేనెతుట్టకదిలి తేనెటీగలు చెలరేగి వృద్ధురాలిపై దాడి చేశాయి. గజ్జవ్వను కాపాడేందుకు ప్రయత్నించిన వెంకటేశ్​, శ్రీనివాస్​పైన దాడి చేశాయి.

తీవ్ర గాయాలైన వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: అర్ధరాత్రి ఇంట్లోకి ఎంటరై.. ఇటుకతో చంపిన దుండగుడు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.