ETV Bharat / crime

selfie suicide: ' నన్ను టార్గెట్​ చేసి వేధిస్తున్నారు.. అందుకే చనిపోతున్నా'

author img

By

Published : Sep 15, 2021, 5:37 PM IST

యజమాని వేధింపులు భరించలేక ఓ రసాయన పరిశ్రమలో పనిచేసే ఉద్యోగి సెల్పీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా డోన్​ మండలంలో జరిగింది. ప్రభుత్వాస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు.

selfie suicide at dhone in kurnool
యజమాని చిత్రహింసలు పెట్టాడని ఓ వ్యక్తి ఆత్మహత్య

యజమాని చిత్రహింసలు పెట్టాడని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా డోన్​ మండలం ఆవులదొడ్డి గ్రామానికి చెందిన అశోక్​ మూడు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. స్థానికులు అతన్ని డోన్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న అశోక్‌ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. గత నాలుగేళ్లుగా ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అశోక్ పని చేస్తున్నాడు. ఫ్యాక్టరీ యజమాని వేధింపులకు గురి చేశాడని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

ఉద్యోగి సెల్పీ వీడియో తీసుకుని బలవన్మరణం

'నేను మందు తాగి చచ్చిపోతున్నా. దానికి కారణం మా సార్​.. డ్యూటీలో నన్నే టార్గెట్​ చేసి చేయకూడని పనులు చేయించుకుని.. బూతులు మాట్లాడి.. నన్ను టార్చర్​ పెట్టేవాడు. అందుకనే.. మందుతాగి చచ్చిపోతున్నా..'- బాధితుడు.

అశోక్ మృతికి నిరసనగా కర్నూలు డోన్​లో కెమికల్ ఫ్యాక్టరీ ముందు ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. అశోక్ మృతికి కారణమైన కెమికల్ ఫ్యాక్టరీ మేనేజర్ శరత్​, నిఖిల్​ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులపై కఠినంగాా వ్యవహరించడం సరికాదని వారు హెచ్చరించారు. కార్మికులను వేధించడం, ఒత్తిళ్లకు గురిచేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు.

'మా కుమారుడి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. అశోక్..​ పైఅధికారులు అతనిని వేధింపులకు గురి చేసేవారు. ఫ్యాక్టరీ యజమాన్యం మా కుటుంబానికి న్యాయం చేయాలి' -అశోక్​ తండ్రి

ఇదీ చదవండి: TOLLYWOOD DRUGS CASE: డ్రగ్స్‌ కేసులో ముమైత్​ఖాన్​ను ప్రశ్నిస్తున్న పోలీసులు

యజమాని చిత్రహింసలు పెట్టాడని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా డోన్​ మండలం ఆవులదొడ్డి గ్రామానికి చెందిన అశోక్​ మూడు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. స్థానికులు అతన్ని డోన్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న అశోక్‌ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. గత నాలుగేళ్లుగా ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అశోక్ పని చేస్తున్నాడు. ఫ్యాక్టరీ యజమాని వేధింపులకు గురి చేశాడని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

ఉద్యోగి సెల్పీ వీడియో తీసుకుని బలవన్మరణం

'నేను మందు తాగి చచ్చిపోతున్నా. దానికి కారణం మా సార్​.. డ్యూటీలో నన్నే టార్గెట్​ చేసి చేయకూడని పనులు చేయించుకుని.. బూతులు మాట్లాడి.. నన్ను టార్చర్​ పెట్టేవాడు. అందుకనే.. మందుతాగి చచ్చిపోతున్నా..'- బాధితుడు.

అశోక్ మృతికి నిరసనగా కర్నూలు డోన్​లో కెమికల్ ఫ్యాక్టరీ ముందు ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. అశోక్ మృతికి కారణమైన కెమికల్ ఫ్యాక్టరీ మేనేజర్ శరత్​, నిఖిల్​ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులపై కఠినంగాా వ్యవహరించడం సరికాదని వారు హెచ్చరించారు. కార్మికులను వేధించడం, ఒత్తిళ్లకు గురిచేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు.

'మా కుమారుడి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. అశోక్..​ పైఅధికారులు అతనిని వేధింపులకు గురి చేసేవారు. ఫ్యాక్టరీ యజమాన్యం మా కుటుంబానికి న్యాయం చేయాలి' -అశోక్​ తండ్రి

ఇదీ చదవండి: TOLLYWOOD DRUGS CASE: డ్రగ్స్‌ కేసులో ముమైత్​ఖాన్​ను ప్రశ్నిస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.