ETV Bharat / crime

Man commits suicide by hanging : ఉరి వేసుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య.. కారణం అదేనా..!

author img

By

Published : Nov 7, 2021, 1:36 PM IST

ఆ దంపతులిద్దరూ విద్యావంతులు.. విద్యార్థులకు పాఠాలు బోధించే వృత్తిలో ఉన్నవారు. కానీ ఓ సమస్య వారి జీవితాలతో పాటు వారి ఇద్దరి పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది... భార్యా,భర్త మధ్య తలెత్తిన వివాదం ముదిరి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు (Man commits suicide by hanging ). ఈ ఘటన జీడిమెట్ల ఠాణా పరిధిలో జరిగింది.

death
death

దంపతుల మధ్య మరో మహిళ ప్రమేయం వారి జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. భర్తకు వేరే మహిళతో అక్రమసంబంధం ఉందనే విషయంపై భార్యా, భర్తకు జరిగిన గొడవతో మనస్తాపం చెందిన భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు (Man commits suicide by hanging). ఈఘటన మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల ఏరియాలో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్, అర్దాసుపల్లికి చెందిన చంద్రశేఖర (47) శ్రీలతకు 20ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీడిమెట్ల ఠాణా పరిధి శ్రీసాయి కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర... నగరంలోని ఫలక్​నుమా ప్రభుత్వ పాఠశాలలో టీచర్​గా, భార్య శ్రీలత అబిడ్స్​లోని గ్రామర్ స్కూల్​లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.

తన భర్తకు వేరే మహిళతో అక్రమసంబంధం ఉందనే విషయంపై శ్రీలత భర్తతో గొడవపడుతోంది. ఈ క్రమంలో శనివారం వీరిద్దరి మధ్య గొడవ తీవ్రంగా జరిగింది. భార్య, పిల్లలు బయటకెళ్లిన సమయంలో చంద్రశేఖర... ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికొచ్చేసరికి భర్త మృతిచెంది ఉండడం చూసిన శ్రీలత.. స్థానికులతో కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: youth commits suicide : నిరుద్యోగి ఆత్మహత్య.. సూసైడ్​ నోట్​లో ఏం రాశాడంటే..

దంపతుల మధ్య మరో మహిళ ప్రమేయం వారి జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. భర్తకు వేరే మహిళతో అక్రమసంబంధం ఉందనే విషయంపై భార్యా, భర్తకు జరిగిన గొడవతో మనస్తాపం చెందిన భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు (Man commits suicide by hanging). ఈఘటన మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల ఏరియాలో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్, అర్దాసుపల్లికి చెందిన చంద్రశేఖర (47) శ్రీలతకు 20ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీడిమెట్ల ఠాణా పరిధి శ్రీసాయి కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర... నగరంలోని ఫలక్​నుమా ప్రభుత్వ పాఠశాలలో టీచర్​గా, భార్య శ్రీలత అబిడ్స్​లోని గ్రామర్ స్కూల్​లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.

తన భర్తకు వేరే మహిళతో అక్రమసంబంధం ఉందనే విషయంపై శ్రీలత భర్తతో గొడవపడుతోంది. ఈ క్రమంలో శనివారం వీరిద్దరి మధ్య గొడవ తీవ్రంగా జరిగింది. భార్య, పిల్లలు బయటకెళ్లిన సమయంలో చంద్రశేఖర... ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికొచ్చేసరికి భర్త మృతిచెంది ఉండడం చూసిన శ్రీలత.. స్థానికులతో కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: youth commits suicide : నిరుద్యోగి ఆత్మహత్య.. సూసైడ్​ నోట్​లో ఏం రాశాడంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.