ETV Bharat / crime

దారుణం: వ్యక్తిపై గొడ్డలితో దాడి.. పరిస్థితి విషమం

author img

By

Published : Feb 24, 2021, 10:55 PM IST

కామారెడ్డి జిల్లా ఖత్​గావ్​లో ఓ వ్యక్తి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిపై గొడ్డలితో దాడి చేశాడు. గాయపడిన అతన్ని బిచ్కుంద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

A Man attacked another man from the same village with an axe
వ్యక్తిపై గొడ్డలితో దాడి.. పరిస్థితి విషమం

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఖత్​గావ్ గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి గొడ్డలితో అదే గ్రామానికి చెందిన చందుపై దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తీవ్రంగా గాయపడిన అతన్ని బిచ్కుంద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. తన వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకే చందుపై దాడి చేసినట్లు శంకర్ వివరించాడని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సాజిద్ తెలిపారు.

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఖత్​గావ్ గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి గొడ్డలితో అదే గ్రామానికి చెందిన చందుపై దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తీవ్రంగా గాయపడిన అతన్ని బిచ్కుంద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. తన వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకే చందుపై దాడి చేసినట్లు శంకర్ వివరించాడని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సాజిద్ తెలిపారు.

ఇదీ చూడండి: పెళ్లి పేరుతో రూ.11 కోట్లు స్వాహా చేసిందిలా...!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.