ETV Bharat / crime

పేకాటలో వివాదం... పోయిన దివ్యాంగుడి ప్రాణం

author img

By

Published : Jun 20, 2021, 4:11 PM IST

మెదక్ జిల్లా బైరన్‌దిబ్బ గ్రామంలో దారుణం జరిగింది. పేకాటలో జరిగిన చిన్నపాటి గొడవ ఓ దివ్యాంగ యువకుడిపై దాడికి దారి తీసింది. తీవ్రగాయాలపాలైన బాధితుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

The life of a disabled person lost in a poker dispute
పేకాట గొడవలో ప్రోయిన ప్రాణం

పేకాటలో జరిగిన చిన్న వివాదం ఓ దివ్యాంగుడిపై దాడికి కారణమైంది. తీవ్రగాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బైరన్‌దిబ్బ గ్రామంలో జరిగింది.

జిల్లాలోని బైరన్‌దిబ్బ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల బస్వరాజ్ అనే దివ్యాంగుడు కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం కొంత మందితో కలిసి గ్రామ శివారులో పేకాట ఆడాడు. ఈ క్రమంలో బస్వరాజ్‌కు, కోళ్లపల్లి భాస్కర్‌ అనే వ్యక్తితో డబ్బు పంపకం విషయంలో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో తీవ్రగాయాలపాలైన బాస్వరాజ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పేకాటలో జరిగిన చిన్న వివాదం ఓ దివ్యాంగుడిపై దాడికి కారణమైంది. తీవ్రగాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బైరన్‌దిబ్బ గ్రామంలో జరిగింది.

జిల్లాలోని బైరన్‌దిబ్బ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల బస్వరాజ్ అనే దివ్యాంగుడు కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం కొంత మందితో కలిసి గ్రామ శివారులో పేకాట ఆడాడు. ఈ క్రమంలో బస్వరాజ్‌కు, కోళ్లపల్లి భాస్కర్‌ అనే వ్యక్తితో డబ్బు పంపకం విషయంలో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో తీవ్రగాయాలపాలైన బాస్వరాజ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: శంషాబాద్​లో కారు బీభత్సం.. ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.