ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో 51వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన సీబీఐ ఉన్నతాధికారి రామ్కుమార్ ఆధ్వర్యంలో.. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ముగ్గురు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పులివెందులకు చెందిన ఉదయ్కుమార్రెడ్డి, ప్రకాశ్, తిరుపతికి చెందిన డాక్టర్ సతీశ్కుమార్రెడ్డిని సీబీఐ విచారణ జరుపుతోంది.
అంతకుముందు...
సోమవారం చేసిన విచారణలో సీబీఐ ఉన్నతాధికారి రామ్కుమార్ ఆధ్వర్యంలో అధికారులు... గంటన్నరకుపైగా వివేకా ఇంటితోపాటు, పరిసరాలు గమనించారు. కడప నుంచి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారుల బృందం పలు విషయాలపై ఆరా తీశారు.