ETV Bharat / crime

LAND KABJA: రూ.10 కోట్లు విలువ చేసే బల్దియా స్థలం కబ్జా?

కోట్ల విలువైన మున్సిపాలిటీ స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. బల్దియాతో సంబంధం లేని పలువురు చక్రం తిప్పుతుండటంతో పాలకవర్గం అభాసుపాలవుతోంది. స్థలాలను రక్షించడంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా మారుతోంది.

author img

By

Published : Jul 1, 2021, 1:20 PM IST

government land occupied
బల్దియా స్థలం కబ్జా?

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని శివాజీచౌక్​లో కూరగాయలు, చేపలు, మాంసం క్రయవిక్రయాలకు సరైన సౌకర్యాలు లేవు. గత సంవత్సరం కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కూరగాయల టోకు వ్యాపారంతో పాటు... క్రయవిక్రయాలకు ఇబ్బందులు ఎదురుకావడంతో... ఖుర్షీద్​నగర్​లోని బల్దియా స్థలం అధికారుల దృష్టికి వచ్చింది. దాని విలువ సుమారు రూ.10కోట్లు. ఆ స్థలమంతా ఎగుడు, దిగుడు, చెత్తాచెదారంతో నిండిపోయి ఉండేది. ఈ క్రమంలో ప్రజల అవసరాల రీత్యా 2020 అక్టోబర్​ 30వ తేదీన మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించింది. శివాజీచౌక్‌ నుంచి కూరగాయల టోకు వ్యాపార లావాదేవీలతోపాటు.. క్రయవిక్రయాలను ఖుర్షీద్‌నగర్‌కు మారిస్తే పట్టణంలోని సగం సమస్య తీరుతుందని భావించింది. అప్పటికప్పుడు బల్దియా స్థలాన్ని కూరగాయ మార్కెట్​కు కేటాయిస్తూ మున్సిపల్​ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది.

దానిలో భాగంగా రూ. 10లక్షలకుపైగా నిధులు వెచ్చించి ఎర్రమట్టితో స్థలాన్ని చదనుచేయించింది. అడ్డుదిడ్డంగా ఉన్నవిద్యుత్‌ స్థంభాలను సైతం తొలగించడంతో ఒక్కసారిగా ఆ స్థలం అందరి దృష్టికి వచ్చింది. కానీ ఇప్పటికీ అక్కడ మార్కెట్​ను ప్రారంభించలేదు. తాజాగా అదే స్థలాన్ని ఆనుకొని ఉన్న మరో రెండెకరాల వివాదాస్పద స్థలాన్ని కలుపుకొని.. ఓ వెంచర్‌ చేయాలనే ఆలోచనలో స్థిరాస్తి వ్యాపారులు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చక్రం తిప్పేది వాళ్లే

బల్దియా స్థలాన్ని ఆనుకొని అంతర్రాష్ట్ర రహాదారి వెళ్తున్నందున స్థిరాస్తి వ్యాపారుల కన్ను దానిపై పడింది. మున్సిపాలిటీతో సంబంధంలేని ఒకరిద్దరు వెనక ఉండి చక్రం తిప్పుతుండటం అధికారులకు పరీక్షగా మారింది. దీంతో కూరగాయలకు కేటాయించే పనులు ప్రారంభించే ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైగా కూరగాయల స్థలాన్ని ప్రస్తుతం ఓ ఫంక్షన్‌ హాల్‌ కోసం కేటాయించే ప్రయత్నం అంతర్గతంగా జరిగిపోయింది. గోడపై ఓ నేత పేరు చెప్పి ఫంక్షన్‌ హాల్‌ కోసం కేటాయించినట్లు రాసిన ఈ రాతలే దీనికి నిదర్శనం. మార్కెట్‌ కోసం కేటాయించిన స్థలం ఇప్పుడు ఫంక్షన్‌ హాల్‌కు ఏ ప్రాతిపదికన కేటాయించారనేది అంతుచిక్కడం లేదు. వెంటనే అక్కడ నిర్మాణం చేపడితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందనే ఆలోచనతో ఆలస్యం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎమ్మెల్యే జోగు రామన్న గిఫ్టుగా ఇచ్చారని గోడలపై రాయించడం అధికారుల దృష్టికి సైతం వెళ్లిందని.. కానీ ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలను బల్దియా మూటగట్టుకోవాల్సి వస్తోంది.

government land occupied
ఎమ్మెల్యే జోగు రామన్న గిఫ్టుగా ఇచ్చారంటూ రాతలు

ఖుర్షీద్‌నగర్‌ స్థలాన్ని కూరగాయల మార్కెట్‌ కోసం కేటాయిస్తూ... మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్రవేసిన మాట వాస్తవమేనని అంగీకరిస్తున్న అధికారులు... స్థిరాస్తి వ్యాపారులు చేస్తున్న ప్రయత్నం తమ దృష్టికి రాలేదంటున్నారు. తొమ్మిది నెలల కిందటనే కూరగాయల విక్రయాల కోసం చకచక పనులు ప్రారంభించి.. వాటిని మధ్యలోనే ఆపేసిన కారణాలను మాత్రం పరిగణలోకి తీసుకోవడంలేదు.

విచారణ చేస్తాం
నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టా. మా అధికారులు ద్వారా తెలిసిన సమాచారం మేరకు ఆ స్థలం కూరగాయల మార్కెట్‌ కోసమే కేటాయించాం. స్థలం కోసం డబ్బులు సైతం వెచ్చించాం. కానీ ఆ స్థలాన్ని ఇతరులకు కేటాయించాలంటే మళ్లీ పురపాలక సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై విచారణ చేస్తాం.

- శైలజ, మున్సిపల్‌ కమిషనర్‌

పట్టణ నడిబొడ్డున ఉన్న కీలకమైన భూములనే అధికారులు నిర్లక్ష్యం చేస్తే... ఇక మారుమూల ప్రాంతాల్లో భూముల పరిస్థితి ఎలా ఉంటుందోననే అనుమానం కలుగకమానదు. ఫంక్షన్‌హాల్‌ కోసమైనా... కౌన్సిల్‌ ఆమోదం పొందాలనే కనీస నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా... ఏకంగా బహుమతిగా ఇచ్చారన్నట్లు బోర్డులు రాయించుకోవడం.. అంతర్గతంగా జరుగుతున్న దందాలపై అనుమానాలు పెంచుతోంది.

ఇదీ చూడండి: బడుగులపై దాడులు- మారాలి పోలీసు ధోరణి

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని శివాజీచౌక్​లో కూరగాయలు, చేపలు, మాంసం క్రయవిక్రయాలకు సరైన సౌకర్యాలు లేవు. గత సంవత్సరం కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కూరగాయల టోకు వ్యాపారంతో పాటు... క్రయవిక్రయాలకు ఇబ్బందులు ఎదురుకావడంతో... ఖుర్షీద్​నగర్​లోని బల్దియా స్థలం అధికారుల దృష్టికి వచ్చింది. దాని విలువ సుమారు రూ.10కోట్లు. ఆ స్థలమంతా ఎగుడు, దిగుడు, చెత్తాచెదారంతో నిండిపోయి ఉండేది. ఈ క్రమంలో ప్రజల అవసరాల రీత్యా 2020 అక్టోబర్​ 30వ తేదీన మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించింది. శివాజీచౌక్‌ నుంచి కూరగాయల టోకు వ్యాపార లావాదేవీలతోపాటు.. క్రయవిక్రయాలను ఖుర్షీద్‌నగర్‌కు మారిస్తే పట్టణంలోని సగం సమస్య తీరుతుందని భావించింది. అప్పటికప్పుడు బల్దియా స్థలాన్ని కూరగాయ మార్కెట్​కు కేటాయిస్తూ మున్సిపల్​ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది.

దానిలో భాగంగా రూ. 10లక్షలకుపైగా నిధులు వెచ్చించి ఎర్రమట్టితో స్థలాన్ని చదనుచేయించింది. అడ్డుదిడ్డంగా ఉన్నవిద్యుత్‌ స్థంభాలను సైతం తొలగించడంతో ఒక్కసారిగా ఆ స్థలం అందరి దృష్టికి వచ్చింది. కానీ ఇప్పటికీ అక్కడ మార్కెట్​ను ప్రారంభించలేదు. తాజాగా అదే స్థలాన్ని ఆనుకొని ఉన్న మరో రెండెకరాల వివాదాస్పద స్థలాన్ని కలుపుకొని.. ఓ వెంచర్‌ చేయాలనే ఆలోచనలో స్థిరాస్తి వ్యాపారులు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చక్రం తిప్పేది వాళ్లే

బల్దియా స్థలాన్ని ఆనుకొని అంతర్రాష్ట్ర రహాదారి వెళ్తున్నందున స్థిరాస్తి వ్యాపారుల కన్ను దానిపై పడింది. మున్సిపాలిటీతో సంబంధంలేని ఒకరిద్దరు వెనక ఉండి చక్రం తిప్పుతుండటం అధికారులకు పరీక్షగా మారింది. దీంతో కూరగాయలకు కేటాయించే పనులు ప్రారంభించే ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైగా కూరగాయల స్థలాన్ని ప్రస్తుతం ఓ ఫంక్షన్‌ హాల్‌ కోసం కేటాయించే ప్రయత్నం అంతర్గతంగా జరిగిపోయింది. గోడపై ఓ నేత పేరు చెప్పి ఫంక్షన్‌ హాల్‌ కోసం కేటాయించినట్లు రాసిన ఈ రాతలే దీనికి నిదర్శనం. మార్కెట్‌ కోసం కేటాయించిన స్థలం ఇప్పుడు ఫంక్షన్‌ హాల్‌కు ఏ ప్రాతిపదికన కేటాయించారనేది అంతుచిక్కడం లేదు. వెంటనే అక్కడ నిర్మాణం చేపడితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందనే ఆలోచనతో ఆలస్యం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎమ్మెల్యే జోగు రామన్న గిఫ్టుగా ఇచ్చారని గోడలపై రాయించడం అధికారుల దృష్టికి సైతం వెళ్లిందని.. కానీ ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలను బల్దియా మూటగట్టుకోవాల్సి వస్తోంది.

government land occupied
ఎమ్మెల్యే జోగు రామన్న గిఫ్టుగా ఇచ్చారంటూ రాతలు

ఖుర్షీద్‌నగర్‌ స్థలాన్ని కూరగాయల మార్కెట్‌ కోసం కేటాయిస్తూ... మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్రవేసిన మాట వాస్తవమేనని అంగీకరిస్తున్న అధికారులు... స్థిరాస్తి వ్యాపారులు చేస్తున్న ప్రయత్నం తమ దృష్టికి రాలేదంటున్నారు. తొమ్మిది నెలల కిందటనే కూరగాయల విక్రయాల కోసం చకచక పనులు ప్రారంభించి.. వాటిని మధ్యలోనే ఆపేసిన కారణాలను మాత్రం పరిగణలోకి తీసుకోవడంలేదు.

విచారణ చేస్తాం
నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టా. మా అధికారులు ద్వారా తెలిసిన సమాచారం మేరకు ఆ స్థలం కూరగాయల మార్కెట్‌ కోసమే కేటాయించాం. స్థలం కోసం డబ్బులు సైతం వెచ్చించాం. కానీ ఆ స్థలాన్ని ఇతరులకు కేటాయించాలంటే మళ్లీ పురపాలక సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై విచారణ చేస్తాం.

- శైలజ, మున్సిపల్‌ కమిషనర్‌

పట్టణ నడిబొడ్డున ఉన్న కీలకమైన భూములనే అధికారులు నిర్లక్ష్యం చేస్తే... ఇక మారుమూల ప్రాంతాల్లో భూముల పరిస్థితి ఎలా ఉంటుందోననే అనుమానం కలుగకమానదు. ఫంక్షన్‌హాల్‌ కోసమైనా... కౌన్సిల్‌ ఆమోదం పొందాలనే కనీస నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా... ఏకంగా బహుమతిగా ఇచ్చారన్నట్లు బోర్డులు రాయించుకోవడం.. అంతర్గతంగా జరుగుతున్న దందాలపై అనుమానాలు పెంచుతోంది.

ఇదీ చూడండి: బడుగులపై దాడులు- మారాలి పోలీసు ధోరణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.