వరంగల్ తూర్పు నియోజకవర్గం కరీమాబాద్ దేశాయిపేటలో స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పర్యటించారు. వలస కూలీలకు 12 కిలోల బియ్యం, నగదు అందజేశారు. వలస కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు సామాజిక దూరం పాటించి కరోనాను నివారించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య