ETV Bharat / city

రైల్వే లైనుకు మరమ్మతులు- ప్రయాణికులకు ఇబ్బందులు - passengers in kajipet station

కాజీపేట-కొండపల్లి రైల్వే మార్గంలో లైన్ మరమ్మతుల కారణంగా కాజీపేట రైల్వే స్టేషన్​ నుంచి వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో ఐదు రోజుల వరకు ఈ పరిస్థితి తప్పదని రైల్వే శాఖ తేల్చి చెప్పింది.

రైల్వే లైనుకు మరమ్మతులు ప్రయాణికులకు ఇబ్బందులు
author img

By

Published : Apr 1, 2019, 6:28 PM IST

రైలు రద్దైంది... ప్రయాణికులకు ఇబ్బందైంది
కాజీపేట-కొండపల్లి రైల్వే మరమ్మతుల కారణంగా కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మణుగూరు, విజయవాడ, అజ్ని ప్యాసింజర్లను ఈరోజు నుంచి ఈ నెల 5వరకు రద్దు చేశారు. రైళ్ల రాకపోకల నిలిపివేతతో ఆ మార్గంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కనీసం రోడ్డు రవాణా లేదు

దూరప్రాంతాలకు వెళ్లవలసిన వారికి రైళ్ల రద్దు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయం తెలియని వారు రైల్వే స్టేషన్​లో పడిగాపులు పడుతున్నారు. బస్సుల్లో వెళ్లేందుకు రోడ్డు మార్గం సరిగ్గా లేదని వాపోతున్నారు.

మళ్లీ అదే పరిస్థితి

కొన్ని రోజుల క్రితం కాజీపేట-బల్లార్ష మధ్య రైల్వే లైన్ మరమ్మతుల వల్ల పలు రైళ్లు రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ మార్గంలో అదే పరిస్థితి. ప్రయాణికులు మాత్రం దూరప్రాంతాలకు వెళ్లేవారిని దృష్టిలో పెట్టుకుని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయకుండా వాటిని యధావిధిగా నడపాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:'తెలంగాణలో లంచం ఇవ్వనిదే ఏ పని జరగడం లేదు'

రైలు రద్దైంది... ప్రయాణికులకు ఇబ్బందైంది
కాజీపేట-కొండపల్లి రైల్వే మరమ్మతుల కారణంగా కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మణుగూరు, విజయవాడ, అజ్ని ప్యాసింజర్లను ఈరోజు నుంచి ఈ నెల 5వరకు రద్దు చేశారు. రైళ్ల రాకపోకల నిలిపివేతతో ఆ మార్గంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కనీసం రోడ్డు రవాణా లేదు

దూరప్రాంతాలకు వెళ్లవలసిన వారికి రైళ్ల రద్దు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయం తెలియని వారు రైల్వే స్టేషన్​లో పడిగాపులు పడుతున్నారు. బస్సుల్లో వెళ్లేందుకు రోడ్డు మార్గం సరిగ్గా లేదని వాపోతున్నారు.

మళ్లీ అదే పరిస్థితి

కొన్ని రోజుల క్రితం కాజీపేట-బల్లార్ష మధ్య రైల్వే లైన్ మరమ్మతుల వల్ల పలు రైళ్లు రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ మార్గంలో అదే పరిస్థితి. ప్రయాణికులు మాత్రం దూరప్రాంతాలకు వెళ్లేవారిని దృష్టిలో పెట్టుకుని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయకుండా వాటిని యధావిధిగా నడపాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:'తెలంగాణలో లంచం ఇవ్వనిదే ఏ పని జరగడం లేదు'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.