నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసేందుకు... భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వరంగల్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. ముందుగా హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోందని... తనను గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడతానని ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల పేరుతో ఆరేళ్లుగా తెరాస మోసం చేసిందని విమర్శించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: మేయర్, డిప్యూటీ మేయర్ల బాధ్యత స్వీకరణ నేడే...