చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమే దసరా పండుగని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్లోని ఉర్సు రంగలీలా మైదానంలో ఏర్పాటుచేసిన రావణవధ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రావణుడిని హతమార్చి రాముడు సుపరిపాలన అందించాడని.. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన సాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, కలెక్టర్ ప్రశాంత్, సీపీ రవీందర్, ఎమ్మెల్యే నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాణాసంచా వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇవీచూడండి: నేత్ర శోభితం...శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మహోత్సవం