మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేదలకు రూ.5 లక్షల విలువ చేసే దుస్తులు పంపిణీ చేశారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేయడం మన బాధ్యతని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడిమేడ్ దుస్తుల వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఆయన పలువురు పేదలకు దుస్తులు పంచారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేదలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్న దాతలను ఆయన అభినందించారు. తెలంగాణను కరోనా నుంచి కాపాడడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, తెరాస నాయకులు రెడిమెడ్ దుస్తుల వ్యాపారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: స్వస్థలాలకు చేరుకోనున్న 4500 మంది వలస కార్మికులు