వరంగల్ అర్బన్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్పై భూ ఆక్రమణ కేసు నమోదైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీసుస్టేషన్లో ఎమ్మెల్యేతో పాటు.. తెరాస నేత ధర్మసాగర్, ఫ్యాక్స్ ఛైర్మన్ గుండేటి రాజేశ్వర్రెడ్డిపై భూ ఆక్రమణ కేసు నమోదైంది. బాలసముద్రానికి చెందిన గుగులోతు దేవిక.. న్యూశాయంపేటలో ఓ వ్యక్తి దగ్గర 2015లో 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తన స్థలంలో చిన్న గది, ప్రహరీ గోడను నిర్మించుకున్నారు.
అయితే ఈ నెల 22న వర్ధన్నపేట ఎమ్మెల్యే అనుచరులు, గుండేటి రాజేశ్వర్రెడ్డి అక్కడకు వచ్చి గోడను కూల్చివేసి స్థలంలోకి ప్రవేశించారు. ఎమ్మెల్యే అనుచరులు వచ్చి బెదిరింపులకు గురి చేసి, గోడను కూల్చివేశారని.. రూ.లక్ష ఆస్తి నష్టం జరిగిందంటూ బాధితురాలు సుబేదారి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్తో పాటు గుండేటి రాజేశ్వర్రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఈ విషయంపై ఎమ్మెల్యేను వివరణ కోరగా తాను ఎలాంటి భూ వివాదాల్లో జోక్యం చేసుకోలేదని బదులిచ్చారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో బార్లు, క్లబ్బులు తెరిచేందుకు ప్రభుత్వ అనుమతి