వరంగల్ గ్రామీణ జిల్లాలోని పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులు బడ్జెట్పై సమీక్షించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు, వాటిని ఏ స్థాయిలో వినియోగించారో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సమీక్షించారు.
బడ్జెట్ రూపకల్పనలో ప్రమాణాలు పాటించలేదని మున్సిపల్ అధికారులపై కలెక్టర్ హరిత అసహనం ప్రదర్శించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు విడుదలైనప్పటికీ పూర్తికాని పనుల గురించి ఆరా తీశారు. అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తే.. పనుల్లో జాప్యం కాదన్నారామె.
ఇవీచూడండి: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్కు ఫిర్యాదు: భట్టి