ETV Bharat / city

Token system for grain purchase: నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లకు మళ్లీ టోకెన్‌ విధానం

ధాన్యం కొనుగోళ్లలో గందరగోళాన్ని నివారించేందుకు అంటూ నల్గొండ జిల్లా అధికారులు.. టోకెన్ల విధానాన్ని (Token system for grain purchase) మళ్లీ ప్రవేశపెడుతున్నారు. టోకెన్లు తీసుకున్న తర్వాతే పంట కోతలు మొదలుపెట్టాలని సూచిస్తున్నారు. తద్వారా మిల్లుల వద్ద రైతులు వేచిచూసే పరిస్థితికి (grains collection in Nalgonda)తెరపడుతుందని భావిస్తున్నారు. గతేడాది నుంచి అమలవుతున్న ఈ పద్ధతిపై.. రైతులు పెదవి విరుస్తున్నారు.

author img

By

Published : Nov 2, 2021, 5:20 AM IST

grains collection in nalgonda
grains collection in nalgonda
Token system for grain purchase: నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లకు మళ్లీ టోకెన్‌ విధానం

నల్గొండ జిల్లాలో ధాన్యం విక్రయాలు.. ప్రతి సీజన్‌లోనూ వివాదాలకు (grains collection in Nalgonda) కేంద్ర బిందువుగా మారుతున్నాయి. వేలాదిగా తరలివస్తున్న ట్రాక్టర్లతో మిల్లులు వాటి సమీపంలోని రహదారుల వద్ద ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. రోజుకు మూణ్నాలుగు వేల వాహనాలు కొనే అవకాశం ఉంటే... 15 నుంచి 20 వేల ట్రాక్టర్లు వస్తుంటాయి. దీంతో రైతులు అక్కడే.. నాలుగైదు రోజుల పాటు వేచి ఉండాల్సిన అగత్యం ఏర్పడుతోంది. దీన్ని నివారించేందుకు అధికార యంత్రాంగం.. 2020 నవంబరు నుంచి టోకెన్ల విధానాన్ని (Token system for grain purchase) అమలు చేస్తోంది. ఇప్పుడు అదే పద్ధతిని తిరిగి అమలుచేయాలని భావిస్తోంది.

కొద్దిరోజుల్లోనే వివాదం..

రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు, మార్కెటింగ్, రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల విభాగాల అధికారుల సమన్వయంతో.. గత యాసంగిలో టోకెన్ల పద్ధతిలో ధాన్యం కొనుగోళ్లు నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ఎడాపెడా పంట కోతలు చేపట్టకుండా... టోకెన్లు అందుకున్న రైతులే సరకు తెచ్చేలా... ఈ విధానాన్ని రూపొందించారు. కానీ కొద్దిరోజుల్లోనే ఇది వివాదంగా మారింది. ఒక్కో రైతు ఒకేసారి ఐదారు వాహనాలు తీసుకురావడం వల్ల... తక్కువ విస్తీర్ణం కలిగిన రైతులు ఇబ్బందులు పడ్డారు. టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే వరుసలో నిల్చునే దీనస్థితి ఏర్పడింది. తహసీల్దారు కార్యాలయాల వద్ద రోజంతా పడిగాపులు పడ్డ దయనీయ సంఘటనలు.. మిర్యాలగూడ, వేములపల్లిలో చోటుచేసుకున్నాయి. ఈసారి అమలుకాబోయే విధానం ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పంట విరామ నిబంధనతో... శుక్ర, ఆదివారాల్లో ధాన్యం తెచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడీ టోకెన్లు వస్తే మళ్లీ కష్టాలు మొదలైనట్లేనని.. అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మద్దతు ధర కంటే తక్కువకే..

గత సీజన్‌లో టోకెన్ల పంపిణీ గందరగోళంగా మారడంతో.. కొద్దిరోజుల తర్వాత కేవలం రెండు గంటల పాటు ఉదయం 8 నుంచి 10 గంటల వరకే అమలు చేశారు. టోకెన్ తీసుకుని, తన లైన్ వచ్చే వరకు ఆగి పంటను అమ్ముకోవాలంటే.. రైతుకు వారం రోజులు పడుతుంది. అదనపు ఖర్చుల పాలయ్యేలా అన్నిరోజుల పాటు వేచి ఉండటం దండగ అని.. మద్దతు ధర కన్నా తక్కువకే అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు రైతులు.. రైస్​ మిల్లుల వద్దే టోకెన్‌ విధానాన్ని తీసుకురావాలని... పలువురు రైతులు సూచిస్తున్నారు.

టోకెన్లు కావాలంటే..

నేటి నుంచి జారీకానున్న టోకెన్లను పొందేవారు.. పాసు పుస్తకంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి ఒక్క టోకెన్ మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే గత యాసంగిలో పంపిణీ కేంద్రాల వద్దకు పెద్దఎత్తున జనం చేరుకోవడం, పేర్ల నమోదు, పంపిణీ ప్రక్రియలో రభస చోటుచేసుకోవడంతో... స్థానిక అధికారులు తలలు పట్టుకున్నారు. సరైన రీతిలో పర్యవేక్షణ లేకపోతే సామాన్యులకు దక్కాల్సిన టోకెన్లు.. పైరవీకారులకు దక్కే అవకాశం మెండుగా ఉంది.

ఇదీచూడండి: 'ఈ నెల 26లోగా సాగు చట్టాలు రద్దు చేయండి.. లేదంటే...'

Token system for grain purchase: నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లకు మళ్లీ టోకెన్‌ విధానం

నల్గొండ జిల్లాలో ధాన్యం విక్రయాలు.. ప్రతి సీజన్‌లోనూ వివాదాలకు (grains collection in Nalgonda) కేంద్ర బిందువుగా మారుతున్నాయి. వేలాదిగా తరలివస్తున్న ట్రాక్టర్లతో మిల్లులు వాటి సమీపంలోని రహదారుల వద్ద ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. రోజుకు మూణ్నాలుగు వేల వాహనాలు కొనే అవకాశం ఉంటే... 15 నుంచి 20 వేల ట్రాక్టర్లు వస్తుంటాయి. దీంతో రైతులు అక్కడే.. నాలుగైదు రోజుల పాటు వేచి ఉండాల్సిన అగత్యం ఏర్పడుతోంది. దీన్ని నివారించేందుకు అధికార యంత్రాంగం.. 2020 నవంబరు నుంచి టోకెన్ల విధానాన్ని (Token system for grain purchase) అమలు చేస్తోంది. ఇప్పుడు అదే పద్ధతిని తిరిగి అమలుచేయాలని భావిస్తోంది.

కొద్దిరోజుల్లోనే వివాదం..

రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు, మార్కెటింగ్, రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల విభాగాల అధికారుల సమన్వయంతో.. గత యాసంగిలో టోకెన్ల పద్ధతిలో ధాన్యం కొనుగోళ్లు నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ఎడాపెడా పంట కోతలు చేపట్టకుండా... టోకెన్లు అందుకున్న రైతులే సరకు తెచ్చేలా... ఈ విధానాన్ని రూపొందించారు. కానీ కొద్దిరోజుల్లోనే ఇది వివాదంగా మారింది. ఒక్కో రైతు ఒకేసారి ఐదారు వాహనాలు తీసుకురావడం వల్ల... తక్కువ విస్తీర్ణం కలిగిన రైతులు ఇబ్బందులు పడ్డారు. టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే వరుసలో నిల్చునే దీనస్థితి ఏర్పడింది. తహసీల్దారు కార్యాలయాల వద్ద రోజంతా పడిగాపులు పడ్డ దయనీయ సంఘటనలు.. మిర్యాలగూడ, వేములపల్లిలో చోటుచేసుకున్నాయి. ఈసారి అమలుకాబోయే విధానం ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పంట విరామ నిబంధనతో... శుక్ర, ఆదివారాల్లో ధాన్యం తెచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడీ టోకెన్లు వస్తే మళ్లీ కష్టాలు మొదలైనట్లేనని.. అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మద్దతు ధర కంటే తక్కువకే..

గత సీజన్‌లో టోకెన్ల పంపిణీ గందరగోళంగా మారడంతో.. కొద్దిరోజుల తర్వాత కేవలం రెండు గంటల పాటు ఉదయం 8 నుంచి 10 గంటల వరకే అమలు చేశారు. టోకెన్ తీసుకుని, తన లైన్ వచ్చే వరకు ఆగి పంటను అమ్ముకోవాలంటే.. రైతుకు వారం రోజులు పడుతుంది. అదనపు ఖర్చుల పాలయ్యేలా అన్నిరోజుల పాటు వేచి ఉండటం దండగ అని.. మద్దతు ధర కన్నా తక్కువకే అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు రైతులు.. రైస్​ మిల్లుల వద్దే టోకెన్‌ విధానాన్ని తీసుకురావాలని... పలువురు రైతులు సూచిస్తున్నారు.

టోకెన్లు కావాలంటే..

నేటి నుంచి జారీకానున్న టోకెన్లను పొందేవారు.. పాసు పుస్తకంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి ఒక్క టోకెన్ మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే గత యాసంగిలో పంపిణీ కేంద్రాల వద్దకు పెద్దఎత్తున జనం చేరుకోవడం, పేర్ల నమోదు, పంపిణీ ప్రక్రియలో రభస చోటుచేసుకోవడంతో... స్థానిక అధికారులు తలలు పట్టుకున్నారు. సరైన రీతిలో పర్యవేక్షణ లేకపోతే సామాన్యులకు దక్కాల్సిన టోకెన్లు.. పైరవీకారులకు దక్కే అవకాశం మెండుగా ఉంది.

ఇదీచూడండి: 'ఈ నెల 26లోగా సాగు చట్టాలు రద్దు చేయండి.. లేదంటే...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.