ETV Bharat / city

ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు మృతి

author img

By

Published : Mar 20, 2020, 11:57 PM IST

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని కింద పడగా.. అటుగా వస్తున్న ఇసుక లారీ బలంగా తగలడం వల్ల ముగ్గురు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.

Three People Died In Road Accident In SuryaPet District
ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు మృతి
ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు మృతి

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన అంజలి(12), నందిని(14) సుమంత్(20)లు మద్దిరాల మండలం గోరుట్ల గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న బైకు ఢీకొని కిందపడ్డారు.

కిందపడుతున్న సమయంలో అటుగా వేగంగా వస్తున్న లారీకి బలంగా ఢీకొనడం వల్ల తీవ్ర గాయాలపాలై ముగ్గురూ ప్రాణాలు విడిచారు. అంజలి, నందిని అక్కడిక్కడే చనిపోగా.. సుమంత్ చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: కరోనా భయాలతో అయినకాడికి అమ్మేస్తున్నారు

ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు మృతి

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన అంజలి(12), నందిని(14) సుమంత్(20)లు మద్దిరాల మండలం గోరుట్ల గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న బైకు ఢీకొని కిందపడ్డారు.

కిందపడుతున్న సమయంలో అటుగా వేగంగా వస్తున్న లారీకి బలంగా ఢీకొనడం వల్ల తీవ్ర గాయాలపాలై ముగ్గురూ ప్రాణాలు విడిచారు. అంజలి, నందిని అక్కడిక్కడే చనిపోగా.. సుమంత్ చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: కరోనా భయాలతో అయినకాడికి అమ్మేస్తున్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.