ETV Bharat / city

పాలమూరులో తగ్గుముఖం పడుతున్న కరోనా!

author img

By

Published : Apr 30, 2020, 8:11 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో లాక్​డౌన్​ అమలుకు యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. కంటైన్మెంట్​ జోన్లు, హోం క్వారంటైన్ల నుంచి ఎవరూ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 5 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు.

corona cases update in union mahabubnagar district
పాలమూరులో తగ్గుముఖం పడుతున్న కరోనా!

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో 6 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. జోగులాంబ గద్వాల జిల్లాలోనే అత్యధికంగా 45 కేసులు యాక్టివ్​గా ఉన్నాయి. వీటిలో గద్వాల పట్టణంలో 31, అయిజలో 6, రాజోలిలో 4, వడ్డేపల్లిలో 2, ఇటిక్యాల, అలంపూర్​లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు కాగా.. వీరిలో 13 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ 570 నమూనాలు పరీక్షల కోసం పంపించగా.. 529 మందికి కరోనా లేదని తేలింది. పాజిటివ్ కేసుల ప్రాథమిక సంబంధీకులు, కుటుంబసభ్యులు, అనుమానితులు 1,258 మంది ప్రస్తుతం హోం క్వారంటైన్​లో ఉన్నారు.

14 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి... కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వీటిలో గద్వాల పట్టణంలో అత్యధికంగా 8 కంటైన్మెంట్ జోన్లు ఉండగా... అయిజలో 2, రాజోలి, ఇటిక్యాల, అలంపూర్, వడ్డేపల్లిలో ఒక్కో కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. కంటైన్మెంట్​ జోన్లు, హోం క్వారంటైన్ నుంచి ఎవరూ ఇళ్లలోంచి బయటకు రాకుండా పోలీసులు, రెవిన్యూ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు హోం క్వారంటైన్ ఉన్న ఇళ్లను సందర్శించి కరోనా లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తున్నాయా ఎప్పటికప్పడు ఆరా తీస్తున్నారు.

మహబూబ్​నగర్ జిల్లాలోనూ పక్షం రోజులకు పైగా కొత్త కేసులు ఏమీ లేవు. మొత్తం 11 కేసులు నమోదు కాగా... 3 కేసులు మాత్రమే యాక్టివ్​గా ఉన్నాయి. మిగిలిన వాళ్లు గాంధీ నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ క్వారంటైన్​లో ఐదుగురు, ఐసోలేషన్​లో ఒక్కరు మాత్రమే ఉన్నారు. సుమారు 313 మంది హోం క్వారంటైన్​లో కొనసాగుతున్నారు. మొత్తం 338 నమూనాలు జిల్లా నుంచి పరీక్షలకు పంపితే... 329 మందికి కరోనా లేదని తేలింది. ఇప్పటి వరకు పంపిన అన్ని నమూనాల ఫలితాలు వెల్లడయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన 327 మంది 14 రోజుల హోం క్వారంటైన్ గడువు ముగించుకుని లాక్​డౌన్ పాటిస్తున్నారు.

తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్​లో కరోనా యాక్టివ్ కేసులు లేని జిల్లాల జాబితాలో నాగర్​కర్నూల్ చేరింది. గతంలో రెండు కేసులు నమోదు కాగా... ఇద్దరూ కోలుకున్నారు. జిల్లా నుంచి 97 మంది నమూనాలు పరీక్షించగా 95మందికి కరోనా లేదని తేలింది. ప్రస్తుతం జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 మంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిలో 370 మంది హోం క్వారంటైన్​లో ఉన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్లు ముగ్గురు, కరోనా పాజిటివ్ కేసు ప్రాథమిక సంబంధీకులుగా ఉన్న 39 మంది, కర్నూల్ నుంచి వచ్చిన ఒక్కరిని హోం క్వారంటైన్​లో ఉంచారు.

నాగర్​కర్నూల్ జిల్లా ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఒకరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నారాయణపేట జిల్లా కూడా యాక్టివ్ కేసులు లేని జిల్లాల జాబితాలో చేరింది. జిల్లా నుంచి 72 నమూనాలు పంపితే అందరికీ కరోనా లేదనే తేలింది. ప్రస్తుతం ప్రభుత్వ క్వారంటైన్​లో 18మంది, నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఐదుగురు, హోం క్వారంటైన్​లో 78 మంది కొనసాగుతున్నారు. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క కరోనా పాజిటవ్ కేసు నమోదు కాలేదు.

ఇదీ చూడండి: ఉద్ధృతి తగ్గుతోంది.. 11 జిల్లాల్లో కరోనా జాడలేదు

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో 6 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. జోగులాంబ గద్వాల జిల్లాలోనే అత్యధికంగా 45 కేసులు యాక్టివ్​గా ఉన్నాయి. వీటిలో గద్వాల పట్టణంలో 31, అయిజలో 6, రాజోలిలో 4, వడ్డేపల్లిలో 2, ఇటిక్యాల, అలంపూర్​లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు కాగా.. వీరిలో 13 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ 570 నమూనాలు పరీక్షల కోసం పంపించగా.. 529 మందికి కరోనా లేదని తేలింది. పాజిటివ్ కేసుల ప్రాథమిక సంబంధీకులు, కుటుంబసభ్యులు, అనుమానితులు 1,258 మంది ప్రస్తుతం హోం క్వారంటైన్​లో ఉన్నారు.

14 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి... కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వీటిలో గద్వాల పట్టణంలో అత్యధికంగా 8 కంటైన్మెంట్ జోన్లు ఉండగా... అయిజలో 2, రాజోలి, ఇటిక్యాల, అలంపూర్, వడ్డేపల్లిలో ఒక్కో కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. కంటైన్మెంట్​ జోన్లు, హోం క్వారంటైన్ నుంచి ఎవరూ ఇళ్లలోంచి బయటకు రాకుండా పోలీసులు, రెవిన్యూ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు హోం క్వారంటైన్ ఉన్న ఇళ్లను సందర్శించి కరోనా లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తున్నాయా ఎప్పటికప్పడు ఆరా తీస్తున్నారు.

మహబూబ్​నగర్ జిల్లాలోనూ పక్షం రోజులకు పైగా కొత్త కేసులు ఏమీ లేవు. మొత్తం 11 కేసులు నమోదు కాగా... 3 కేసులు మాత్రమే యాక్టివ్​గా ఉన్నాయి. మిగిలిన వాళ్లు గాంధీ నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ క్వారంటైన్​లో ఐదుగురు, ఐసోలేషన్​లో ఒక్కరు మాత్రమే ఉన్నారు. సుమారు 313 మంది హోం క్వారంటైన్​లో కొనసాగుతున్నారు. మొత్తం 338 నమూనాలు జిల్లా నుంచి పరీక్షలకు పంపితే... 329 మందికి కరోనా లేదని తేలింది. ఇప్పటి వరకు పంపిన అన్ని నమూనాల ఫలితాలు వెల్లడయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన 327 మంది 14 రోజుల హోం క్వారంటైన్ గడువు ముగించుకుని లాక్​డౌన్ పాటిస్తున్నారు.

తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్​లో కరోనా యాక్టివ్ కేసులు లేని జిల్లాల జాబితాలో నాగర్​కర్నూల్ చేరింది. గతంలో రెండు కేసులు నమోదు కాగా... ఇద్దరూ కోలుకున్నారు. జిల్లా నుంచి 97 మంది నమూనాలు పరీక్షించగా 95మందికి కరోనా లేదని తేలింది. ప్రస్తుతం జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 మంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిలో 370 మంది హోం క్వారంటైన్​లో ఉన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్లు ముగ్గురు, కరోనా పాజిటివ్ కేసు ప్రాథమిక సంబంధీకులుగా ఉన్న 39 మంది, కర్నూల్ నుంచి వచ్చిన ఒక్కరిని హోం క్వారంటైన్​లో ఉంచారు.

నాగర్​కర్నూల్ జిల్లా ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఒకరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నారాయణపేట జిల్లా కూడా యాక్టివ్ కేసులు లేని జిల్లాల జాబితాలో చేరింది. జిల్లా నుంచి 72 నమూనాలు పంపితే అందరికీ కరోనా లేదనే తేలింది. ప్రస్తుతం ప్రభుత్వ క్వారంటైన్​లో 18మంది, నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఐదుగురు, హోం క్వారంటైన్​లో 78 మంది కొనసాగుతున్నారు. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క కరోనా పాజిటవ్ కేసు నమోదు కాలేదు.

ఇదీ చూడండి: ఉద్ధృతి తగ్గుతోంది.. 11 జిల్లాల్లో కరోనా జాడలేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.