ఖమ్మం జిల్లాలో అమలు చేస్తున్న లాక్డౌన్ను పోలీసులు స్వల్పంగా సడలించారు. కరోనా నివారణలో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్ సత్ఫలితాలనిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయడంలో విజయవంతమయ్యారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో కూడా పోలీసులు లాక్డౌన్ పటిష్టంగా అమలుచేశారు. ప్రజలు సైతం పోలీసులకు సహకరించి లాక్డౌన్ అమలులో సహకరించారు.
జిల్లాలో ప్రస్తుతం పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల లాక్డౌన్లో కాస్త సడలింపు ఇచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లాక్డౌన్ కొనసాగిస్తూనే.. కొన్ని ప్రాంతాల్లో సడలించారు. జిల్లాకేంద్రంలో మొత్తం నాలుగు కంటైన్మెంట్ ప్రాంతాలు ఉండగా.. పెద్దతండ, మోతినగర్లో నిబంధనలు సడలించారు. ఖిల్లా బజార్, బీకే బజార్ కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ పటిష్టంగా కొనసాగుతున్నది.
ఇవీచూడండి: మరో రెండురోజులు కేంద్ర బృందం పర్యటన