ETV Bharat / city

లకారం మినీ ట్యాంక్‌ బండ్​ను‌ ప్రారంభించిన మంత్రి పువ్వాడ - khammam mini tankbund

ఖమ్మం జిల్లా కేంద్రంలో మినీ ట్యాంక్‌ బండ్‌ను నగర మేయర్‌ పాపాలాల్‌తో కలిసి ప్రారంభించారు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఫిట్‌ ఫర్‌ ఇండియా రన్‌ను ప్రారంభించి పరుగులో పాల్గొన్నారు. నడక సాధకులు ఈ వాకర్స్​ ట్రాక్​ను వినియోగించాలని కోరారు.

lakaram mini tank bund opend by puvvada ajay kumar at khammam
ఉదయపు నడక కోసం లకారం మినీ ట్యాంక్‌ బండ్‌ ప్రారంభం
author img

By

Published : Oct 2, 2020, 6:57 PM IST

ఖమ్మం వాసుల ఉదయపు నడక కోసం నగరంలో అన్ని వసతులతో కూడిన లకారం మినీ ట్యాంక్‌ బండ్‌ను సిద్ధం చేసినట్లు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. మేయర్‌ పాపాలాల్‌తో కలిసి మినీ ట్యాంక్‌ బండ్‌ను ప్రారంభించారు. సుమారు 2 కోట్లతో నూతన ట్రాక్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఖమ్మంలో చాలా మంది మార్నింగ్ వాక్ చేసే వారున్నారని.. అందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కనీసం వెయ్యి మంది శాశ్వత సభ్యత్వం తీసుకోవాలన్నారు. నెలకు వంద రూపాయలు సభ్యత్వ ఫీజు ఉంటుందన్నారు.

నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన చెత్త వాహనాల కరపత్రం విడుదల చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఫిట్‌ ఫర్‌ ఇండియా రన్‌ను ప్రారంభించారు. క్రీడాకారులు, విద్యార్థులతో కలిసి ట్రాక్‌పై పరుగులు పెట్టారు. మంత్రితోపాటు కలెక్టర్‌ కర్ణన్‌, నగర పాలక కమిషనర్‌ అనురాగ్, కార్పొరేటర్లు, నగర వాసులు పరుగులో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయి: జేపీ

ఖమ్మం వాసుల ఉదయపు నడక కోసం నగరంలో అన్ని వసతులతో కూడిన లకారం మినీ ట్యాంక్‌ బండ్‌ను సిద్ధం చేసినట్లు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. మేయర్‌ పాపాలాల్‌తో కలిసి మినీ ట్యాంక్‌ బండ్‌ను ప్రారంభించారు. సుమారు 2 కోట్లతో నూతన ట్రాక్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఖమ్మంలో చాలా మంది మార్నింగ్ వాక్ చేసే వారున్నారని.. అందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కనీసం వెయ్యి మంది శాశ్వత సభ్యత్వం తీసుకోవాలన్నారు. నెలకు వంద రూపాయలు సభ్యత్వ ఫీజు ఉంటుందన్నారు.

నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన చెత్త వాహనాల కరపత్రం విడుదల చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఫిట్‌ ఫర్‌ ఇండియా రన్‌ను ప్రారంభించారు. క్రీడాకారులు, విద్యార్థులతో కలిసి ట్రాక్‌పై పరుగులు పెట్టారు. మంత్రితోపాటు కలెక్టర్‌ కర్ణన్‌, నగర పాలక కమిషనర్‌ అనురాగ్, కార్పొరేటర్లు, నగర వాసులు పరుగులో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయి: జేపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.