ETV Bharat / city

lockdown effect: లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోతున్న చిరువ్యాపారులు

author img

By

Published : May 29, 2021, 4:13 AM IST

లాక్‌డౌన్(lockdown) కారణంగా చిరువ్యాపారులు(venders) తీవ్రంగా నష్టపోతున్నారు. క్రయవిక్రయాలకు 4 గంటల సమయం ఇస్తున్నా కూరగాయల వ్యాపారుల(vegetable sellers) పరిస్థితి దయనీయంగా మారింది. ఉదయాన్నే కొనుగోలుదారులు రాకపోవడంతో కరీంనగర్‌ మార్కెట్‌లో కూరగాయలు చెడిపోతున్నాయని వాపోతున్నారు. కఠిన నిబంధనల అమలుతో వ్యాపారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోతున్న చిరువ్యాపారులు
lockdown effect
లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోతున్న చిరువ్యాపారులు

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ ప్రభావం.. కూరగాయల రైతులు, విక్రయదారులపై తీవ్రంగా పడుతోంది. ఉదయం 6 నుంచి 10 వరకు ఆంక్షలు సడలించినా.. కొనుగోలుదారులు 8గంటల తర్వాతే వస్తున్నారని చెబుతున్నారు. పోలీసులు తొమ్మిన్నరకే దుకాణాలు మూసివేయిస్తుండటంతో కూరగాయలు అమ్ముడుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి ఎక్కువ ధరకు కూరగాయలు కొన్నా... విక్రయాలు జరగక పారేస్తున్నామని వాపోతున్నారు. మరో రెండు గంటలు సమయం(lockdown exemption) ఇస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు.

అమ్ముకునే అవకాశం లేక..
వివిధ గ్రామాలకు చెందిన రైతులు కూరగాయలు విక్రయం కోసం కరీంనగర్‌ మార్కెట్‌(Karimnagar market) కు వస్తుంటారు. ఎంతో శ్రమపడి పండించి తీసుకొచ్చినా అమ్ముకునే అవకాశం లేక చెత్తకుప్పల్లో పడేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. ఉదయాన్నే కూరగాయల కొనుగోళ్లకు రావాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పురావట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. రద్దీకి భయపడి కొనుగోలు దారులు ఆలస్యంగా వస్తుండటంతో... 8 నుంచి 9గంటల మధ్య జనం భారీగా గుమిగూడుతున్నారు.

సీఎంకు విజ్ఞప్తి..
కరోనా నిబంధనలు పాటిస్తూనే కూరగాయలు విక్రయిస్తామని.. తమ ఇబ్బందులు గమనించి ఆదుకోవాలని వ్యాపారులు ముఖ్యమంత్రి కేసీఆర్​(KCR) కు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'మున్సిపల్​ సిబ్బంది.. డబ్బులివ్వమని వేధిస్తున్నారు'

లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోతున్న చిరువ్యాపారులు

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ ప్రభావం.. కూరగాయల రైతులు, విక్రయదారులపై తీవ్రంగా పడుతోంది. ఉదయం 6 నుంచి 10 వరకు ఆంక్షలు సడలించినా.. కొనుగోలుదారులు 8గంటల తర్వాతే వస్తున్నారని చెబుతున్నారు. పోలీసులు తొమ్మిన్నరకే దుకాణాలు మూసివేయిస్తుండటంతో కూరగాయలు అమ్ముడుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి ఎక్కువ ధరకు కూరగాయలు కొన్నా... విక్రయాలు జరగక పారేస్తున్నామని వాపోతున్నారు. మరో రెండు గంటలు సమయం(lockdown exemption) ఇస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు.

అమ్ముకునే అవకాశం లేక..
వివిధ గ్రామాలకు చెందిన రైతులు కూరగాయలు విక్రయం కోసం కరీంనగర్‌ మార్కెట్‌(Karimnagar market) కు వస్తుంటారు. ఎంతో శ్రమపడి పండించి తీసుకొచ్చినా అమ్ముకునే అవకాశం లేక చెత్తకుప్పల్లో పడేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. ఉదయాన్నే కూరగాయల కొనుగోళ్లకు రావాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పురావట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. రద్దీకి భయపడి కొనుగోలు దారులు ఆలస్యంగా వస్తుండటంతో... 8 నుంచి 9గంటల మధ్య జనం భారీగా గుమిగూడుతున్నారు.

సీఎంకు విజ్ఞప్తి..
కరోనా నిబంధనలు పాటిస్తూనే కూరగాయలు విక్రయిస్తామని.. తమ ఇబ్బందులు గమనించి ఆదుకోవాలని వ్యాపారులు ముఖ్యమంత్రి కేసీఆర్​(KCR) కు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'మున్సిపల్​ సిబ్బంది.. డబ్బులివ్వమని వేధిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.